ఇరాక్లో ఆచూకీ తెలియకుండా పోయిన భారతీయులు ఇక లేరనే వార్త వారి కుటుంబసభ్యులను తీవ్రంగా కలచివేస్తోంది. ఇరాక్లో 2014లో అదృశ్యమైన 39 మంది భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు హత్య చేశారని మంగళవారం (మార్చి 20) కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో ప్రకటించారు. ఈ వార్తతో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు షాక్కు గురయ్యారు. తమ వారి మరణంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, టీవీలో సుష్మాస్వరాజ్ ప్రకటన చూసి కంగుతిన్నామని తెలిపారు.
‘నా సోదరుడు మరణించాడన్న వార్తను నమ్మలేకపోతున్నా. మా కంటే ముందుగా ప్రపంచానికి ఈ వార్తను తెలియజేయడం దారుణం. టీవీలో ఆ వార్త చూసి షాక్కు గురయ్యా. వారు బతికే ఉన్నారని ఆశతో ఉన్నాం. మాకు మాట మాత్రమైనా చెప్పకుండా, మీరు ఈ ప్రపంచానికి వారు చనిపోయినట్లు ప్రకటించారు. ఇప్పటికీ మాకు దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’ అని ఇరాక్లో మరణించిన మజిందర్ సింగ్ సోదరి గుర్పిందర్ కౌర్ అన్నారు.
‘గత నాలుగేళ్లుగా వాళ్లు బతికే ఉన్నారని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని కూడా చెప్పారు. ఇప్పుడు ఇలాంటి వార్త చెప్పి మమ్మల్ని తీరని శోకంలో ముంచారు’ అని ఇరాక్లో మరణించిన మరో యువకుడు విద్యాభూషన్ తివారీ అంకుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ 39 మంది భారతీయులు మరణించినట్లు ఆధారాలు లభించేవరకూ వారు జీవించి ఉన్నట్లే భావిస్తామని గత ఏడాది జులైలో ప్రభుత్వం పేర్కొంది. ఆధారాలు లేకుండా చనిపోయినట్లు చెప్పడం తప్పని సుష్మ గతంలో అన్నారు. అయితే విచారణలో వారు మరణించినట్లు తెలిసిందని ఇవాళ ఆమె పార్లమెంటులో వెల్లడించారు.
‘మోసుల్ పట్టణంలోని ఓ సామూహిక సమాధిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. డీఎన్ఏ పరీక్షతో వారు చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చాం’ అని సుష్మ తెలిపారు. ఇరాక్లోని మోసుల్ నగరంలో కూలీలుగా పని చేస్తున్న 40 భారతీయుల బృందాన్ని 2014లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించారు. 39 మందిని ముష్కరులు చంపేయ్యగా, హర్జిత్ మాసీ అనే వ్యక్తి మాత్రం ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్నాడు.
‘నా సోదరుడు మరణించాడన్న వార్తను నమ్మలేకపోతున్నా. మా కంటే ముందుగా ప్రపంచానికి ఈ వార్తను తెలియజేయడం దారుణం. టీవీలో ఆ వార్త చూసి షాక్కు గురయ్యా. వారు బతికే ఉన్నారని ఆశతో ఉన్నాం. మాకు మాట మాత్రమైనా చెప్పకుండా, మీరు ఈ ప్రపంచానికి వారు చనిపోయినట్లు ప్రకటించారు. ఇప్పటికీ మాకు దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’ అని ఇరాక్లో మరణించిన మజిందర్ సింగ్ సోదరి గుర్పిందర్ కౌర్ అన్నారు.
‘గత నాలుగేళ్లుగా వాళ్లు బతికే ఉన్నారని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని కూడా చెప్పారు. ఇప్పుడు ఇలాంటి వార్త చెప్పి మమ్మల్ని తీరని శోకంలో ముంచారు’ అని ఇరాక్లో మరణించిన మరో యువకుడు విద్యాభూషన్ తివారీ అంకుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ 39 మంది భారతీయులు మరణించినట్లు ఆధారాలు లభించేవరకూ వారు జీవించి ఉన్నట్లే భావిస్తామని గత ఏడాది జులైలో ప్రభుత్వం పేర్కొంది. ఆధారాలు లేకుండా చనిపోయినట్లు చెప్పడం తప్పని సుష్మ గతంలో అన్నారు. అయితే విచారణలో వారు మరణించినట్లు తెలిసిందని ఇవాళ ఆమె పార్లమెంటులో వెల్లడించారు.
‘మోసుల్ పట్టణంలోని ఓ సామూహిక సమాధిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. డీఎన్ఏ పరీక్షతో వారు చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చాం’ అని సుష్మ తెలిపారు. ఇరాక్లోని మోసుల్ నగరంలో కూలీలుగా పని చేస్తున్న 40 భారతీయుల బృందాన్ని 2014లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించారు. 39 మందిని ముష్కరులు చంపేయ్యగా, హర్జిత్ మాసీ అనే వ్యక్తి మాత్రం ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్నాడు.