యాప్నగరం

ఆధార్ ప‘రేషన్’.. ఆకలితో చిన్నారి మృతి

ఆధార్‌తో రేషన్ కార్డును అనుసంధానం చేయకపోవడంతో.. రేషన్ ఇవ్వడం మానేశారు. దీంతో ఆకలి తట్టుకోలేక ఓ చిన్నారి ప్రాణాలు వదిలింది.

TNN 17 Oct 2017, 2:17 pm
ఆధార్ కార్డుతో రేషన్ కార్డు అనుసంధానం చేసుకోకపోవడంతో.. రేషన్ దుకాణంలో బియ్యం ఇవ్వలేదు. దీంతో ఆకలి బాధ తాళలేక 11 ఏళ్ల చిన్నారి మరణించింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని సిమ్‌డెగా జిల్లాలో చోటు చేసుకుంది. సంక్షేమ పథకాలన్నింటికీ ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తున్న సర్కారు రేషన్ కార్డులకు కూడా దీన్ని లింక్ చేయాలని ఆదేశించింది. కానీ కోలీ దేవీ కుటుంబం ఆ పని చేయలేదు. దీంతో రేషన్ షాప్‌కెళ్తే.. నీకు బియ్యం ఇవ్వమని చెప్పారు.
Samayam Telugu family denied ration over aadhaar linking girl starves to death
ఆధార్ ప‘రేషన్’.. ఆకలితో చిన్నారి మృతి


తినడానికి తిండి కూడా లేని స్థితిలో అన్నం.. అన్నం అంటూ తన కుమార్తె ప్రాణాలు విడిచిందని కోలీ దేవి కన్నీటి పర్యంతమయ్యారు. బిడ్డకు పట్టెడన్నం కూడా పెట్టలేకపోయానని.. దీంతో సెప్టెంబర్ 28న తన బిడ్డ చనిపోయిందని ఆమె తెలిపారు.

ఆధార్‌ కార్డులేని వారికి కూడా రేషన్ ఇవ్వాల్సిందేనని సుప్రీం కోర్టు గతంలో తీర్పు వెలువరించింది.. ఆధార్ లేని వారిని గుర్తించిన అనంతరం వారికి బియ్యం పంపిణీ చేస్తామని జార్ఖండ్ ఆహార సరఫరా శాఖ మంత్రి సర్యూ రాయ్ తెలిపారు. కార్డ్ లేని కారణంతో ఎవరైనా మరణిస్తే.. ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోవడంతో.. జార్ఖండ్‌లో లక్షలాది మందికి రేషన్ షాపుల ద్వారా సరకులు ఇవ్వడం ఆపేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.