వరుడు ఆలస్యంగా వచ్చాడనో... బట్టతల అనో పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు ఉన్నాయి. కానీ ఓ విచిత్రమైన కారణంతో తమిళనాడులో ఓ పెళ్లి ఆగిపోయింది. (Wedding Called Off) అన్ని ఏర్పాట్లు చేసుకుని కాసేపట్లో పెళ్లి అయిపోతుందనుకున్న సమయానికి కుటుంబ సభ్యులు గెస్ట్లకు షాక్ ఇచ్చారు. బిర్యానీ లేకపోవడంతో పెళ్లి ఆపేస్తున్నట్టు చెప్పడంతో అతిథులు అవాక్కయ్యారు.
ఒరతనాడులో ఓ కుటుంబం పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అందులో భాగంగా వచ్చే అతిథులకు నాన్ వెజ్ బిర్యానీతో భోజనాలు పెట్టాలనుకుంది. దీనికోసం ఓ బిర్యానీ సెంటర్కు ఆర్డర్ ఇచ్చారు. రుచికరమైన బిర్యానీతో విందు కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అతిథులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇతర చర్యలు తీసుకున్నారు. కానీ వారు అనకున్నట్టుగా భోజనాల్లో బిర్యానీ తయారై రాకపోవడంతో పెళ్లి క్యాన్సల్ చేశారు.
పెళ్లి బృందం నాన్ వెజ్ బిర్యానీ కోసం సేలం ఆర్ఆర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులకు ఆర్డర్ ఇచ్చారు. దాని కోసం జొమాటో ద్వారా 3 వేల 500 కిలోల మాంసాన్ని కూడా తెప్పించారు. జొమాటో బెంగళూరు నుంచి తమిళనాడుకు మటన్, చికెన్ పార్శిల్స్ను పంపించింది. కానీ ఆ ఆన్లైన్ ఆర్డర్లో కుళ్లిన మాంసం వచ్చింది. దాంతో పెళ్లివారు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తనిఖీల కోసం వచ్చిన అధికారులు అది కుళ్లిన మాంసమేనని తేల్చారు. దాంతో అధికారులు సేలం ఆర్ఆర్ బిర్యానీ, జొమాటో వివరణ ఇవ్వాలని నోటీసుల జారీ చేశారు. ఇక బిర్యానీ లేకపోవడంతో పెళ్లిని రద్దు చేశారు. విందులో నాన్ వెజ్ బిర్యానీ లేకపోవడంతో కొత్త జంట ఒకటి కాలేకపోయింది.
గతంలో ఒడిశాలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అక్కడ మటన్ కర్రీ లేకపోవడం వల్ల పెళ్లి ఆగిపోయింది. భోజనాల్లో మటన్ కర్రీ లేదని తెలుసుకున్న వరుడు కుటుంబ సభ్యులు.. వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. ఆ గొడవ కాస్తా పెరిగి పెద్దది కావడంతో వివాహం పెళ్లి వేదికలోనే ఆగిపోయింది.
ఒరతనాడులో ఓ కుటుంబం పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అందులో భాగంగా వచ్చే అతిథులకు నాన్ వెజ్ బిర్యానీతో భోజనాలు పెట్టాలనుకుంది. దీనికోసం ఓ బిర్యానీ సెంటర్కు ఆర్డర్ ఇచ్చారు. రుచికరమైన బిర్యానీతో విందు కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అతిథులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇతర చర్యలు తీసుకున్నారు. కానీ వారు అనకున్నట్టుగా భోజనాల్లో బిర్యానీ తయారై రాకపోవడంతో పెళ్లి క్యాన్సల్ చేశారు.
పెళ్లి బృందం నాన్ వెజ్ బిర్యానీ కోసం సేలం ఆర్ఆర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులకు ఆర్డర్ ఇచ్చారు. దాని కోసం జొమాటో ద్వారా 3 వేల 500 కిలోల మాంసాన్ని కూడా తెప్పించారు. జొమాటో బెంగళూరు నుంచి తమిళనాడుకు మటన్, చికెన్ పార్శిల్స్ను పంపించింది. కానీ ఆ ఆన్లైన్ ఆర్డర్లో కుళ్లిన మాంసం వచ్చింది. దాంతో పెళ్లివారు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తనిఖీల కోసం వచ్చిన అధికారులు అది కుళ్లిన మాంసమేనని తేల్చారు. దాంతో అధికారులు సేలం ఆర్ఆర్ బిర్యానీ, జొమాటో వివరణ ఇవ్వాలని నోటీసుల జారీ చేశారు. ఇక బిర్యానీ లేకపోవడంతో పెళ్లిని రద్దు చేశారు. విందులో నాన్ వెజ్ బిర్యానీ లేకపోవడంతో కొత్త జంట ఒకటి కాలేకపోయింది.
గతంలో ఒడిశాలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అక్కడ మటన్ కర్రీ లేకపోవడం వల్ల పెళ్లి ఆగిపోయింది. భోజనాల్లో మటన్ కర్రీ లేదని తెలుసుకున్న వరుడు కుటుంబ సభ్యులు.. వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. ఆ గొడవ కాస్తా పెరిగి పెద్దది కావడంతో వివాహం పెళ్లి వేదికలోనే ఆగిపోయింది.