యాప్నగరం

పండగపూట విషాదం.. చేతబడి భయంతో కుటుంబం ఆత్మహత్య

చేతబడి భయంతో ఆత్మహత్య చేసుకున్నకుటుంబం. పండగపూట విషాదం నింపిన ఘటన.

Samayam Telugu 13 Sep 2018, 6:23 pm
పచ్చని కుటుంబం.. సాఫీగా సాగిపోతున్న జీవితం. ఇంతలో ఏ జరిగిందో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. విషం తాగి ప్రాణాలు తీసుకోవడం కలకలంరేపింది. పండుగ రోజు జరిగిన ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పెను విషాదాన్ని నింపింది. నగరంలోని కృష్ణానగర్‌కు చెందిన కునాల్ త్రివేదికి సొంత వ్యాపారాలు ఉన్నాయి. త్రివేది తన భార్య, కూతురు, తల్లితో కలిసి ఉంటున్నాడు. వ్యాపారంలో కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకపోవడంతో జీవితం సాఫీగా సాగిపోతోంది.
Samayam Telugu Suicide


గురువారం ఉదయం త్రివేది కుటుంబ సభ్యులు తలుపులు తీయలేదు. అనుమానంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు తీసి చూసి షాకయ్యారు. త్రివేదితో పాటూ భార్య, కూతురు, తల్లి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. త్రివేది, భార్య, కూతురు చనిపోయారు. కొన ఊపిరితో ఉన్న అతడి తల్లిని ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు త్రివేది ఇంట్లో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆత్మహత్యకు గల కారణాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తమ కుటుంబంపై చేతబడి జరిగిందని త్రివేది కొద్ది రోజులుగా అనుమానిస్తున్నారట. కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురికావడంతో వారిలో ప్రాణ భయం ఎక్కువయ్యిందట. అందుకే వారు ఆత్మహత్య చేసుకొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సూసైడ్ లేఖను ల్యాబరేటరీకి పంపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.