రేపిస్టు బాబాకు జైలు శిక్ష.. ఆ జర్నలిస్టుకు ఘన నివాళి
డేరా ఆశ్రమంలోని తన అకృత్యాలను బయటి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసిన చాలా మందిని గుర్మీత్ రాం రహీమ్ చంపేశారని తీవ్ర ఆరోపణలున్నాయి.
TNN 29 Aug 2017, 12:08 pm
డేరా ఆశ్రమంలోని తన అకృత్యాలను బయటి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసిన చాలా మందిని గుర్మీత్ రాం రహీమ్ చంపేశారని తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయన గుట్టును బయటపెట్టే ఏ ఒక్కరిని వదల్లేదని, చిత్రహింసలు పెట్టారు. తాజాగా రేప్ కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష వేసిన సంగతి తెలిసిందే. అయితే బాబాకు శిక్ష పడటం పట్ల జర్నలిస్టు రామ్చందర్ ఛత్రపతి కుమారుడు అన్షుల్ హర్షం వ్యక్తం చేశారు. చివరికి న్యాయమే గెలిచిందని, తన తండ్రికి ఇది ఘన నివాళి అని అన్షుల్ చెప్పారు. తన తండ్రి హత్యకేసులో కూడా గుర్మీత్కు శిక్షపడితే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు.
రామ్ చందర్ ఛత్రపతి నిజాయితీ గల జర్నలిస్టు. ‘పూర సచ్’ పేరుతో స్థానికంగా హిందీ పత్రికను నడిపేవారు. సిర్సాలోని డేరా ఆశ్రమంలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దారుణాలపై ఛత్రపతి తన పత్రికలో ఒక కథనం ప్రచురించారు. గుర్మీత్ అకృత్యాల 2002లో డేరా ఆశ్రమంలోని ఓ సాధ్వి ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయికి లేఖ రాశారు. ఆశ్రమంలోని సాధ్విలను గుర్మీత్ బలవంతంగా ఎలా అనుభవిస్తున్నాడో ఆ లేఖలో వివరించారు. లేఖను సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించింది. సాధ్వి రాసిన లేఖను ఛత్రపతి తన పత్రికలో ప్రచురించారు.
అయితే 2002 అక్టోబర్ 24న ఛత్రపతి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఛత్రపతిది ఆత్మహత్య కాదని, హత్యేనని కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు ఆ కేసు కూడా విచారణకు రానుంది. ఛత్రపతి హత్య కేసులో సెప్టెంబర్ 16 నుంచి పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు వాదనలు విననుంది. మరోవైపు తన తండ్రిది ముమ్మాటికే హత్యేనని ఛత్రపతి కుమారుడు అన్షుల్ ఆరోపిస్తున్నారు.
‘సాధ్వి రాసిన లేఖను ప్రచురించినందుకు మా నాన్నను చిత్రహింసలు పెట్టారు. లేఖను సుమోటోగా తీసుకున్న హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ తరవాత 2002 అక్టోబర్ 24న మా నాన్నపై దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు మా నాన్నపై ఐదుసార్లు కాల్పులు జరిపి చంపేశారు’ అని నాటి దుర్ఘటనను అన్షుల్ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి హత్యకేసును వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కాగా, గుర్మీత్కు 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన అన్షుల్కు హర్యానా ప్రభుత్వం పోలీస్ భద్రత కల్పించింది.
రామ్ చందర్ ఛత్రపతి నిజాయితీ గల జర్నలిస్టు. ‘పూర సచ్’ పేరుతో స్థానికంగా హిందీ పత్రికను నడిపేవారు. సిర్సాలోని డేరా ఆశ్రమంలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దారుణాలపై ఛత్రపతి తన పత్రికలో ఒక కథనం ప్రచురించారు. గుర్మీత్ అకృత్యాల 2002లో డేరా ఆశ్రమంలోని ఓ సాధ్వి ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయికి లేఖ రాశారు. ఆశ్రమంలోని సాధ్విలను గుర్మీత్ బలవంతంగా ఎలా అనుభవిస్తున్నాడో ఆ లేఖలో వివరించారు. లేఖను సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించింది. సాధ్వి రాసిన లేఖను ఛత్రపతి తన పత్రికలో ప్రచురించారు.
అయితే 2002 అక్టోబర్ 24న ఛత్రపతి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఛత్రపతిది ఆత్మహత్య కాదని, హత్యేనని కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు ఆ కేసు కూడా విచారణకు రానుంది. ఛత్రపతి హత్య కేసులో సెప్టెంబర్ 16 నుంచి పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు వాదనలు విననుంది. మరోవైపు తన తండ్రిది ముమ్మాటికే హత్యేనని ఛత్రపతి కుమారుడు అన్షుల్ ఆరోపిస్తున్నారు.
‘సాధ్వి రాసిన లేఖను ప్రచురించినందుకు మా నాన్నను చిత్రహింసలు పెట్టారు. లేఖను సుమోటోగా తీసుకున్న హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ తరవాత 2002 అక్టోబర్ 24న మా నాన్నపై దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు మా నాన్నపై ఐదుసార్లు కాల్పులు జరిపి చంపేశారు’ అని నాటి దుర్ఘటనను అన్షుల్ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి హత్యకేసును వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కాగా, గుర్మీత్కు 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన అన్షుల్కు హర్యానా ప్రభుత్వం పోలీస్ భద్రత కల్పించింది.