యాప్నగరం

డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయ పార్టీ

ర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీగా 2014 సెప్టెంబర్‌‌లో బాధ్యతలు చేపట్టిన అనుపమ షణై అక్రమార్కుల పీచమణిచి, అక్రమ మద్యం వ్యాపారాలపై ఉక్కుపాదం మోపి సంచలనం సృష్టించారు.

TNN 13 Oct 2017, 1:14 pm
కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీగా 2014 సెప్టెంబర్‌‌లో బాధ్యతలు చేపట్టిన అనుపమ షణై అక్రమార్కుల పీచమణిచి, అక్రమ మద్యం వ్యాపారాలపై ఉక్కుపాదం మోపి సంచలనం సృష్టించారు. అక్రమ మద్యం కట్టడి విషయంలో అప్పటి జిల్లా ఇన్‌ ఛార్జి మంత్రి పరమేశ్వర్‌ నాయక్‌‌తో ఆమె విభేదించారు. దీంతో నేరుగా ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఆమె అక్రమ మద్యాన్ని ప్రోత్సహిస్తోందంటూ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. దీంతో అనుపమకు భారీ సంఖ్యలో మద్దతు లభించడమే కాదు, ఆమె ధైర్యానికి ఫిదా అయిపోయారు. ఊహించని విధంగా 2016లో ఆమె డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం మౌనంగా ఉన్నారు.
Samayam Telugu farmer dsp anupama shenoy will started new political party
డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయ పార్టీ


తాజాగా కల్బుర్గిలో తన అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహిళా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను రాజకీయ పార్టీ స్థాపించబోతున్నానని ఆమె ప్రకటించారు. దానికి మహిళల మద్దతు అవసరమని ఆమె పేర్కొన్నారు. రాజకీయ పార్టీలన్నీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తాయి కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేస్తున్నాయని ఆరోపించారు. మహిళల సంక్షేమం గురించి కాంగ్రెస్, బీజేపీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు.తమ పార్టీలో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని అనుపమ స్పష్టం చేశారు. కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 అసెంబ్లీ సీట్లు మహిళలకు కేటాయిస్తానని ఆమె ప్రకటించారు. ఎక్కడైతే ఆమె పదవిని వదిలేశారో..అదే కుడ్లిగిలో నవంబర్ 1న బహిరంగ సభ ఏర్పాటు చేసి, పార్టీ ప్రకటన చేయనున్నారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.