యాప్నగరం

చర్చలకు సిద్ధం.. కేంద్రానికి రైతుల లేఖ

Delhi: కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించారు. డిసెంబర్ 29న చర్చలకు వస్తామని తెలిపారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాక జాయింట్ సెక్రటరీ వివేక్ అగర్వాల్‌కు లేఖ రాశారు.

Samayam Telugu 26 Dec 2020, 11:19 pm
కేంద్రం రాసిన లేఖపై రైతు సంఘాల నేతలు స్పందించారు. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వస్తామని ప్రకటించారు. డిసెంబర్ 29న ఉదయం 11 గంటలకు చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 40 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు శనివారం (డిసెంబర్ 26) సాయంత్రం ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ వివేక్‌ అగర్వాల్‌కు లేఖ రాశారు. అయితే.. వ్యవసాయ చట్టాల తొలగింపు అంశం ఎజెండాలో ఉంటేనే చర్చలకు వస్తామని షరతు పెట్టారు.
Samayam Telugu రైతు సంఘాల నేతలు
Farmers Protest


రైతులను ఆరో దఫా చర్చలకు ఆహ్వానిస్తూ వివేక్ అగర్వాల్ రెండు రోజుల కిందట లేఖ రాసిన విషయం తెలిసింది. తేదీ మీరే ఖరారు చేయండి అంటూ ప్రభుత్వం తరఫున రైతులకు ఆయన ఆఫర్ ఇచ్చారు. రైతు సంఘాల ప్రతినిధులు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ అంశంపై సమావేశమై చర్చించారు. అనంతరం తమ చర్చలకు తమ ఆమోదాన్ని తెలుపుతూ వివేక్ అగర్వాల్‌కు లేఖ రాశారు.

మూడు వ్యవసాయ చట్టాలను తొలగించే అంశం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వడం, పంట వ్యర్థాలు తగులబెట్టిన విషయంలో నమోదు చేసిన కేసులను ఎత్తేయడం, విద్యుత్‌ ముసాయిదా బిల్లు-2020లో మార్పులు చేర్పులు తదితర అంశాలను ఎజెండాలో తప్పనిసరిగా చేర్చాలని రైతులు డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే మంగళవారం ఉదయం చర్చలకు వస్తామని తెలిపారు. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read: కరోనా బలహీనత కనుగొన్నారు.. ఇక చెక్ పెట్టడమే, గొప్ప ముందడుగు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.