యాప్నగరం

రైల్ రోకో, టోల్ కలెక్షన్స్ బంద్.. రైతుల ఆందోళన ఉద్ధృతం

Rail Roko: రైతు సంఘాల నేతలు తమ తదుపరి కార్యాచరణ ప్రకటించారు. ఫిబ్రవరి 12న టోల్ గేట్ల వద్ద కలెక్షన్లను అడ్డుకోనున్నారు. ఫిబ్రవరి 18న దేశవ్యాప్తంగా రైల్ రోకో నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Samayam Telugu 10 Feb 2021, 11:50 pm
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకు పైగా ఆందోళన చేస్తున్న రైతులు.. సరైన హామీ రాకపోవడంతో దూకుడు పెంచారు. తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 18న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాటు దేశవ్యాప్తంగా రైళ్లను అడ్డుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) బుధవారం (ఫిబ్రవరి 10) ఒక ప్రకటన విడుదల చేసింది.
Samayam Telugu రైతుల ఆందోళన
Farmers protest


ఫిబ్రవరి 12 నుంచి రాజస్థాన్‌లోని అన్ని టోల్‌ ప్లాజాల వద్ద టోల్‌ కలెక్షన్‌ను కొనసాగనీయబోమని రైతు సంఘాల నేతలు తెలిపారు. పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా ఫిబ్రవరి 14న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.

గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్ల పరేడ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో రైతుల ఆందోళన తగ్గుముఖం పట్టినట్లే కనిపించింది. కానీ, క్రమంగా పుంజుకుంది. ఇటీవల హైవేల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘాల నేతలు తదుపరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందుకోసం సింఘు సరిహద్దు వద్ద సమావేశమయ్యారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.