యాప్నగరం

రంగంలోకి అమిత్ షా.. రైతులకు పిలుపు, ఇక నిరసనలకు చెక్ పెడతారా?

Bharat Bandh: రైతులతో జరుపుతున్న చర్చలు ఎంతకీ కొలిక్కి రాకపోవడంతో హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. రైతులను చర్చలకు ఆహ్వానించారు. ఇక రైతు సమస్యలకు స్వస్తి పలకాలనే భావనతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 8 Dec 2020, 5:45 pm
రైతులతో ప్రభుత్వం చేస్తున్న చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో హోం మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. రైతు సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించారు. మంగళవారం (డిసెంబర్ 8) రాత్రి 7 గంటల సమయంలో రైతులతో అమిత్ షా భేటీ కానున్నారు. అమిత్ షాతో చర్చలకు హాజరు కావాలని అటు రైతు సంఘాల నేతలు కూడా నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu అమిత్ షా
Amit Shah


వాస్తవానికి రైతు సంఘాల ప్రతినిధులతో బుధవారం ఉదయం భేటీ కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఆ నిర్ణయాన్ని సమీక్షించి మంగళవారం రాత్రే రైతులతో మాట్లాడని నిర్ణయం తీసుకున్నారు. రైతులతో హోం మంత్రి అమిత్ షా భేటీ కావాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నదాతలతో చర్చలు జరిపి వారి నిరసనలకు స్వస్తి పలకాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం రాత్రి 7 గంటలకు రైతులు చర్చలకు రావాలని హోం మంత్రి అమిత్‌ షా తమను ఆహ్వానించారని రైతు సంఘాల నాయకుడు రాకేశ్‌ టికైట్‌ తెలిపారు. అమిత్ షా తమను ఫోన్‌ కాల్‌ ద్వారా సంప్రదించినట్లు ఆయన చెప్పారు. ఢిల్లీ సమీపంలో జాతీయ రహదారులపై నిరసనలు కొనసాగిస్తున్న రైతులు సమావేశానికి హాజరవుతారని రాకేశ్‌ తెలిపారు.

మరోవైపు భారత్ బంద్ విజయవంతమైందని రైతు సంఘాలు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా తమకు మద్దతు తెలిపిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపాయి.

Also Read: కన్న తల్లిదండ్రులతో సమానం: సోనూసూద్‌

Must Read: మా విషయాల్లో వేలు పెట్టొద్దు.. కెనడా ప్రధానికి భారత్‌ హెచ్చరిక

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.