ఈడొచ్చిన ఇద్దరు కూతుళ్లు కాడెడ్లుగా మారిన వేళ.. ఓ రైతన్న అరక పట్టి దుక్కి దున్నాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని ఝాన్సీలో చోటు చేసుకుంది. ఇలా చేయడం వల్ల వరణుడు కరుణిస్తాడని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని నమ్ముతున్నట్టు ఆ రైతు బిడ్డలు తెలిపారు. వర్షాకాలం వచ్చినా వానలు పడటం లేదు. ఇలా కూతుళ్లను కాడెడ్లుగా మార్చి దుక్కి దున్నడం వల్ల వర్షం కురుస్తుందనే నమ్మకం ఉండటం వల్లే ఇలా చేశానని సదరు రైతు తెలిపాడు.
ఈడొచ్చిన కూతుళ్లే కాడెడ్లుగా.. దుక్కి దున్నిన రైతన్న
ఎద్దులకు బదులు తన ఇద్దరు కూతుళ్లు కాడి పట్టిన వేళ.. ఉత్తర ప్రదేశ్కు చెందిన ఓ రైతన్న అరకతో పొలం దున్నాడు.
Samayam Telugu 2 Jul 2018, 3:21 pm