యాప్నగరం

ఆకలి బాధ.. రూ.200కే బిడ్డను అమ్మేశారు..!

కడుపున పుట్టిన బిడ్డ ఆకలిబాధ చూడలేక రూ.200కే చిన్నారిని ఓ కుటుంబం విక్రయించిన ఘటన త్రిపురలో ఆలస్యంగా

TNN 7 Dec 2017, 7:37 am
కడుపున పుట్టిన బిడ్డ ఆకలిబాధ చూడలేక రూ.200కే చిన్నారిని ఓ కుటుంబం విక్రయించిన ఘటన త్రిపురలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెలియామోరా గ్రామంలో నివసించే ఆ పేద కుటుంబంలో అప్పటికే నలుగురు పిల్లలు ఉండటంతో 8 నెలల పాపని పోషించుకోలేక అమ్ముకున్నట్లు.. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మీడియా ముందు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో ఈ వార్త సంచలనం సృష్టించడంతో జిల్లా అధికారులు స్పందించారు.
Samayam Telugu father sells off baby daughter for 200 in tripura
ఆకలి బాధ.. రూ.200కే బిడ్డను అమ్మేశారు..!


‘ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడం లేదనేదానికి ఈ ఘటనే నిదర్శనం’ అంటూ త్రిపుర రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బిప్లబ్‌దాస్ విమర్శలు గుప్పించారు. దీంతో జిల్లా అధికారులు బాధిత కుటుంబానికి దుస్తులు, వంట సామాగ్రి అందజేసి.. పాపని తిరిగి వారికి అప్పగించారు. భవిష్యత్‌లో కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా వారు తెలిపారు. మారుమూల గ్రామం కావడంతో మాణిక్ సర్కార్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.