భారత పర్యటనలో ఉన్న జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టెర్రరిజంపై పోరాటం ఏ మతానికి వ్యతిరేకంగానో లేదంటే ముస్లింలకు వ్యతిరేకంగానో కాదన్నారు. ఇది హింస, ద్వేషానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధమని తెలిపారు. ఈ విషయంలో జరిగే తప్పుడు ప్రచారాలను సరి చూసుకోవాలని ఆయన సూచించారు. అబ్దుల్లా మాటలు ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి మరింత చేయూనిచ్చేలా ఉండటంతోపాటు.. మన దేశానికి నైతిక మద్దతు లభించినట్లయ్యింది.
‘మహ్మద్ ప్రవక్త మానవత్వ, దయ గురించి బోధించాడు. వాటినే నా పిల్లలకు చెబుతాను. ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మంది ఇస్లాం పట్ల విశ్వాసం కలిగి ఉన్నార’ని అబ్దుల్లా తెలిపారు. ‘ఇస్లాం వారసత్వం: అవగాహన కల్పన, ఆదునికీకరణ’ అనే అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించిన సదస్సులో ప్రసంగించిన ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.
ప్రపంచ శాంతి కోసం అందరం కలిసి పని చేయాలని సూచించిన అబ్దుల్లా.. విశ్వమంతా ఒకే కుటుంబమన్నారు. ప్రపంచ శాంతి కోసం జోర్డాన్ కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
అంతకు ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అనేక మతాలు, విశ్వాసాలకు భారత్ పుట్టినిల్లుగా అభివర్ణించారు. బుద్ధుడి నుంచి మహాత్మా గాంధీ భారత్ ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తోందన్నారు. పశ్చిమ దేశాల పర్యటనలో భాగంగా మూడు వారాల క్రితమే ప్రధాని మోదీ జోర్డాన్ వెళ్లిన సంగతి తెలిసిందే.
‘మహ్మద్ ప్రవక్త మానవత్వ, దయ గురించి బోధించాడు. వాటినే నా పిల్లలకు చెబుతాను. ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మంది ఇస్లాం పట్ల విశ్వాసం కలిగి ఉన్నార’ని అబ్దుల్లా తెలిపారు. ‘ఇస్లాం వారసత్వం: అవగాహన కల్పన, ఆదునికీకరణ’ అనే అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించిన సదస్సులో ప్రసంగించిన ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.
ప్రపంచ శాంతి కోసం అందరం కలిసి పని చేయాలని సూచించిన అబ్దుల్లా.. విశ్వమంతా ఒకే కుటుంబమన్నారు. ప్రపంచ శాంతి కోసం జోర్డాన్ కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
అంతకు ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అనేక మతాలు, విశ్వాసాలకు భారత్ పుట్టినిల్లుగా అభివర్ణించారు. బుద్ధుడి నుంచి మహాత్మా గాంధీ భారత్ ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తోందన్నారు. పశ్చిమ దేశాల పర్యటనలో భాగంగా మూడు వారాల క్రితమే ప్రధాని మోదీ జోర్డాన్ వెళ్లిన సంగతి తెలిసిందే.