యాప్నగరం

తెలంగాణకు రూ.129 కోట్లు, ఏపీకి రూ.119 కోట్లు విడుదల చేసిన కేంద్రం

GST: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు రుణాలు అందజేసింది. పదో విడత పరిహారం కింద మొత్తం 6 వేల కోట్ల రూపాయల రుణాలు విడుదల చేసింది.

Samayam Telugu 4 Jan 2021, 10:02 pm
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు పదో విడత రుణాలను విడుదల చేసింది. ఈ విడతలో రూ.6000 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం (జనవరి 4) వెల్లడించింది. వీటిలో తెలంగాణకు రూ.129.57 కోట్లు, ఏపీకి రూ.119.82 కోట్లు విడుదలయ్యాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Currency


GST పరిహారం కింద రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.60 వేల కోట్లను రుణంగా ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.1433.25 కోట్లు, తెలంగాణకు రూ.947.73 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది.

జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన లోటును కేంద్రమే భరిస్తోంది. పరిహారం కింద పలు విడతలుగా నిధులు విడుదల చేస్తోంది. ఈసారి మొత్తాన్ని రూ.1.10 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఆ మొత్తాన్ని రుణాలుగా అందజేస్తోంది. ఇప్పటికే సగానికి పైగా రుణాలను అందజేసింది.

Also Read: అది బీజేపీ వ్యాక్సిన్.. ఎలా నమ్మను, నేను తీసుకోను..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.