యాప్నగరం

కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్‌కు ఈసీ ఆదేశం!

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సంబంధిత అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

TNN 29 Jan 2017, 2:08 pm
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సంబంధిత అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో పాటు తమ హెచ్చరికలను కూడా పట్టించుకోని కేజ్రీవాల్‌పై ఈసీ మండిపడింది. ఈనెల 8న గోవాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన కేజ్రీవాల్ ‘ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకోండి.. కానీ మా పార్టీకే ఓటేయండి’ అని ప్రజలకు సూచించారు.
Samayam Telugu fir against arvind kejriwal ordered by election commission for poll bribe remarks
కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్‌కు ఈసీ ఆదేశం!


దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన ఈసీ ఈ వ్యాఖ్యలు ఓటర్లను డబ్బులు తీసుకోమని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉన్నాయని కేజ్రీవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా జనవరి 19లోగా వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్‌ను ఈసీ ఆదేశించింది. కానీ కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు. ఈసీవి తప్పుడు చర్యలని, అది చెప్పేవన్ని అబద్ధాలని ఆక్షేపించారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ జనవరి 21న కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది.

అయినప్పటికీ కేజ్రీవాల్ దిగిరాకపోవడంతో తాజాగా ఆదివారం ఆయన ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపే నివేదికను జనవరి 31వ తేది మధ్యాహ్నం 3 గంటలలోపు తమకు అందజేయాలని సంబంధిత అధికారులను ఈసీ ఆదేశించింది. కాగా, ఫిబ్రవరి 4 నుంచి గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.