యాప్నగరం

మోడీ సభల్లో కుర్చీలు విసరండి!

కర్ణాటక ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడానికి వచ్చే ప్రధాని మోడీపై కుర్చీలు విసరాలని పిలుపునిచ్చారు

TNN 7 Apr 2018, 11:18 am
కర్ణాటక ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడానికి వచ్చే ప్రధాని మోడీపై కుర్చీలు విసరాలని పిలుపునిచ్చారు గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ. మోడీ ప్రజలను వంచించాడు అని ధ్వజమెత్తుతూ ఈ దళిత నేత ఈ పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే పిలుపుతో కర్ణాటకలో దళిత సంఘాలు శుక్రవారం ఒక సమావేశాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు జిగ్నేశ్. ఈ సందర్భంగా ఆయన మోడీపై విరుచుకుపడ్డారు.
Samayam Telugu mevani-759


ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని, అయితే ఇప్పుడు లక్షల మందిని నిరుద్యోగులుగా మారుస్తున్నారని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో మోడీ బీజేపీ తరఫున ప్రచారానికి వస్తారని, అప్పుడు నిరసన తెలపాలని అన్నారు.

కుర్చీలు విసిరి మోడీ సభల్లో గొడవలు రేపాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మార్పులు దళితులను అణిచి వేసేందుకు జరుగుతున్న కుట్ర అని జిగ్నేష్ అభిప్రాయపడ్డారు.

కాగా మోడీ సభల్లో కుర్చీలు విసిరి, గొడవలు రేపాలన్న వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ విషయంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.