యాప్నగరం

Bangalore Air Show Fire: ఏరోఇండియా షోలో భారీ అగ్ని ప్రమాదం.. 300కి పైగా కార్లు బుగ్గి

భారీ అగ్నిప్రమాదంతో బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యలహంక ఎయిర్ బేస్‌లో జరుగుతున్న ఏరోఇండియా షోలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 300కి పైగా కార్లు దగ్ధమయ్యాయి.

Samayam Telugu 23 Feb 2019, 3:24 pm

ప్రధానాంశాలు:

  • బెంగళూరులో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
  • యలహంక ఎయిర్‌బేస్‌లో జరుగుతున్న ఏరోఇండియా 2019 షో పార్కింగ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
  • ఈ ఘటనలో 300కి పైగా కార్లు దగ్ధమయ్యాయి.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu pjimage (13)
  • కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏరో ఇండియా షోలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ప్రదర్శనను చూసేందుకు వచ్చిన సందర్శకుల వాహనాలకు యలహంక ఎయిర్‌బేస్ స్టేషన్ సమీపంలో పార్కింగ్ ఏర్పాటుచేశారు. వారాంతం కావడంతో శనివారం ఈ ప్రదర్శణను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో పార్కింగ్ ప్రాంతం కార్లు, ద్విచక్రవాహనాలతో నిండిపోయింది.
  • అయితే శనివారం పార్కింగ్ ప్రాంతంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. భారీ అగ్నికీలలతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు 300కి పైగా కార్లు అగ్నికి ఆహుతైనట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. కార్లలోని ఇంధనం తోడు కావడంతో మంటలు మరింత వ్యాపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని 15 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు

  • పార్కింగ్‌ స్థలంలో కొన్ని వందల కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్నాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ప్రమాదం ఆకస్మాతుగా జరిగిందా, లేక ఎవరైనా నిప్పు పెట్టారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ పార్కింగ్‌ స్థలానికి సమీపంలోనే కొన్ని విమానాలను కూడా ఉంచినట్లు తెలుస్తోంది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.