యాప్నగరం

ముంబై: 13 అంతస్తుల భవంతిలో భారీ అగ్ని ప్రమాదం

Mumbai నగరంలోని 13 అంతస్తుల ఓ భవంతిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది నలుగురిని రక్షించారు.

Samayam Telugu 22 Dec 2019, 9:27 pm
ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం (డిసెంబర్ 22) రాత్రి 7.15 గంటల సమయంలో నగరంలోని విలేపార్లే ప్రాంతంలో ఓ భవనంలో మంటలు చెలరేగాయి. 13 అంతస్తుల శ్రీవల్లీ భవనంలో ఏడో ఫ్లోర్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వేగంగా విస్తరిస్తున్న మంటలు 8వ అంతస్తుకు వ్యాపించాయి. మంటల్లో పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న నలుగురిని బయటకి తీసుకొచ్చారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu అగ్ని ప్రమాదం


ఫైర్ సిబ్బంది 10 అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.