యాప్నగరం

కరోనా హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం.. 127 మంది రోగులకు తప్పిన ముప్పు

Odisha: కరోనా హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐసీయూలో మంటలు చెలరేగాయి. దీంతో 127 మంది రోగులు భయాందోళనకు గురయ్యారు. వారిని హుటాహుటిన మరో హాస్పిటల్‌కు తరలించారు.

Samayam Telugu 21 Sep 2020, 9:05 pm
సలే కరోనా మహమ్మారి బారినపడి ఆ రోగులంతా ఎప్పుడు బయట పడతామా అని బిక్కుబిక్కుమంటున్నారు. అగ్ని ప్రమాదం వారిని మరింత వణికించింది. ఒడిశాలోని కటక్ జిల్లాలో ఓ కరోనా హాస్పిటల్‌లో ఐసీయూలో అగ్ని ప్రమాదం సంభవించింది. రోగులందరినీ హుటాహుటిన మరో హాస్పిటల్‌కు తరలించారు. 127 మంది రోగులు ప్రాణాలతో బయటపడ్డారు.
Samayam Telugu కరోనా ఆస్పత్రిలో ఫైర్ యాక్సిడెంట్
Fire accident in Covid hospital in Odisha


కటక్ జిల్లా జగత్‌పూర్‌లోని సద్గురు కొవిడ్ హాస్పిటల్‌లో సోమవారం (సెప్టెంబర్ 21) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో అక్కడి సిబ్బంది, రోగులు భయంతో పరుగులు తీశారు.

హాస్పిటల్ ప్రాంగణమంతా అంబులెన్స్‌లతో నిండిపోయింది. రోగులందరినీ ఇరత హాస్పిటళ్లకు షిఫ్ట్ చేశారు. అధికారులు, పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

మరోవైపు.. సద్గురు హాస్పిటల్‌కు ఫైర్ సేఫ్టీ చర్యలకు సంబంధించిన అనుమతులు లేవని అధికారులు తెలిపారు. కరోనా చికిత్సకు సంబంధించి ఈ హాస్పిటల్‌ నెల కిందటే కార్యకలాపాలు ప్రారంభించింది. 150 పడకలతో సేవలు అందిస్తోంది. కటక్, భువనేశ్వర్‌లో హాస్పిటళ్లు కిక్కిరిసిపోవడంతో రోగులు ఈ హాస్పిటల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఒడిశాలో సుమారు 1.84 లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు 700 మందికి పైగా మరణించారు.

Also Read: వీడియో: పొలాల్లో కూలిన హెలికాప్టర్.. పైలట్ దుర్మరణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.