యాప్నగరం

ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

Samayam Telugu 24 Mar 2019, 7:39 pm
ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ట్రామా సెంటర్‌లో ఆదివారం (మార్చి 24) సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం లోపలి నుంచి ఒక్కసారిగా మంటలు బయటికి వ్యాపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. రోగులు, బంధువులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డట్టు తెలుస్తోంది. ఆస్పత్రి ప్రాంగణంలో దట్టమైన పొగ అలుముకుంది.
Samayam Telugu fire


అగ్ని ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.