యాప్నగరం

9 అంతస్తుల భవనంలో మంటలు.. ప్రమాదంలో 100 మంది

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తొమ్మిది అంతస్తుల భవనం మంటల్లో చిక్కుకుంది. సుమారు 100 మంది ప్రమాదంలో పడ్డట్లు తెలుస్తోంది.

Samayam Telugu 22 Jul 2019, 6:12 pm
ముంబైలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది అంతస్తుల బిల్డింగ్‌లోని 3వ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 3, 4వ అంతస్తుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు 100 మంది వరకు చిక్కుకున్నట్లు సమాచారం. 14 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి.
Samayam Telugu mumbai
ముంబై అగ్ని ప్రమాదం


ముంబైలోని బాంద్రా పశ్చిమ భాగంలో సోమవారం (జులై 22) సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన భవనంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టెలికమ్ కంపెనీ ‘ఎంటీఎన్‌ఎల్’ ఉంది.

ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఉద్యోగులు భవనం పైభాగానికి చేరుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మంటలు అంతకంతకూ వ్యాపిస్తుండటంతో ఆందోళన నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.