యాప్నగరం

బ్రేకింగ్ న్యూస్.. ప్రధాని నివాసంలో అగ్నిప్రమాదం..

ప్రధాని మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Samayam Telugu 30 Dec 2019, 8:09 pm
ఢిల్లీ: ప్రధాని మోదీ అధికార నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 7.25 గంటల సమయంలో.. 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని మోదీ నివాసంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 9 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. వెంటనే అంబులెన్సులు కూడా ప్రధాని నివాసానికి చేరుకున్నాయి. ప్రధాని నివాసంలోని ఎలక్ట్రిక్ కంట్రోల్‌ రూంలో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. కానీ అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు.
Samayam Telugu pm residence


వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని నివాసానికి వెళ్లే మార్గాలను మూసివేశారు. ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఉండే ప్రధాని నివాసంలో అగ్ని ప్రమాదం తలెత్తడం పలు అనుమానాలకు తావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.