పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని భవనంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిజ్వాలలు చెలరేగాయి. ఆ భవన పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది ఆ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ముండ్కా మెట్రో స్టేషన్లోని పిల్లర్ నంబర్ 544 సమీపంలోని భవనంలో మంటలు వ్యాపించాయి. సాయంత్రం 4.40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
భవనంలో చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. అయితే ఈ ఘటనలో ఒక మహిళ మృతదేహం లభ్యమైందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. మూడు అంతస్తుల బిల్డింగ్లోని మొదటి అంతస్థులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, రూటర్ల తయారీ కంపెనీ ఆఫీసులో మంటలు అంటుకున్నాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ కంపెనీ యజమాని పోలీసుల అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
ఘటనా స్థలంలో తొమ్మిది అగ్నిమాపక దళాలు ఉన్నాయని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. అలాగే ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్ను కూడా అందుబాటులో ఉంచామని పోలీసులు తెలిపారు. కాగా కొన్ని గంటల ముందే జమ్మూ కశ్మీర్లో ఓ బస్సులో కూడా మంటలు వ్యాపించి.. నలుగురు చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
భవనంలో చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. అయితే ఈ ఘటనలో ఒక మహిళ మృతదేహం లభ్యమైందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. మూడు అంతస్తుల బిల్డింగ్లోని మొదటి అంతస్థులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, రూటర్ల తయారీ కంపెనీ ఆఫీసులో మంటలు అంటుకున్నాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ కంపెనీ యజమాని పోలీసుల అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
ఘటనా స్థలంలో తొమ్మిది అగ్నిమాపక దళాలు ఉన్నాయని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. అలాగే ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్ను కూడా అందుబాటులో ఉంచామని పోలీసులు తెలిపారు. కాగా కొన్ని గంటల ముందే జమ్మూ కశ్మీర్లో ఓ బస్సులో కూడా మంటలు వ్యాపించి.. నలుగురు చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.