యాప్నగరం

చెన్నై అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం

చెన్నైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగడంతో నలుగురు మరణించారు.

TNN 8 May 2017, 9:02 am
చెన్నైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగడంతో నలుగురు మరణించారు. అందులో ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఏడుగురు తీవ్రంగా గామపడ్డారు. వీరంతా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. చెన్నైలోని వడపళని ప్రాంతంలో ఉన్న అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. దీంతో గ్రౌండ్ ఫ్లోర్ లో నివసిస్తున్న వారు ఎటూ వెళ్లలేక పోయారు. విపరీతమైన పొగతో ఊపిరాడక వారు మరణించినట్టు పోలీసులు భావిస్తున్నారు. సెల్లార్ లో ఉన్న 10 ద్విచక్రవాహనాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఆ అపార్ట్ మెంట్ లో నాలుగంతస్థుల్లో ఉంది. సెల్లార్ ఇరుకుగా ఉండడంతో గ్రౌండ్ ఫోర్ లో ఉన్నవాళ్లకి తప్పించుకునే వీలు కూడా లేకపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ అపార్ట మెంట్ లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కూడా మరణించారు. వారిని మీనాక్షి (65), సెల్వి (30), సంధ్య (10), సంజయ్ (3) గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu fire breaks out in chennai apartment complex four died
చెన్నై అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.