ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం సంభవించడంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో ఘటనా స్థలానికి 34 ఫైరింజన్లు చేరుకొని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో ఎమర్జెన్సీ వార్డుకు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో దట్టమైన పొగలు రెండో అంతస్తుకు సైతం వ్యాపించాయి. దీంతో రోగులంతా భయంతో పరుగులు తీశారు. ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడినట్టు సమాచారం.
Read Also: విషమించిన జైట్లీ ఆరోగ్యం.. ఎయిమ్స్కు నేతల క్యూ
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం జరగడంతో అత్యవసర ల్యాబ్ను అధికారులు మూసివేశారు. ఎమర్జెన్సీ ల్యాబ్ సహా బీ బ్లాక్, వార్డ్ ఏబీ1, సూపర్స్పెషాలిటీ ఓపీడీలు మంటల్లో చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, అత్యవసర విభాగం నుంచి రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు డ్యూటీ డాక్టర్లు వెల్లడించారు. కాగా, తీవ్ర అనారోగ్యానికి గురైన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ గత కొద్ది రోజులుగా ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
ఎయిమ్స్లోనే అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆయన గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఎయిమ్స్లోని వేరే భవనంలో అరుణ్ జైట్లీకి చికిత్స కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం జైట్లీకి కార్డియాక్ న్యూరో సెంటర్లో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు, జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఎయిమ్స్కు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.
Read Also: విషమించిన జైట్లీ ఆరోగ్యం.. ఎయిమ్స్కు నేతల క్యూ
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం జరగడంతో అత్యవసర ల్యాబ్ను అధికారులు మూసివేశారు. ఎమర్జెన్సీ ల్యాబ్ సహా బీ బ్లాక్, వార్డ్ ఏబీ1, సూపర్స్పెషాలిటీ ఓపీడీలు మంటల్లో చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, అత్యవసర విభాగం నుంచి రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు డ్యూటీ డాక్టర్లు వెల్లడించారు. కాగా, తీవ్ర అనారోగ్యానికి గురైన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ గత కొద్ది రోజులుగా ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
ఎయిమ్స్లోనే అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆయన గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఎయిమ్స్లోని వేరే భవనంలో అరుణ్ జైట్లీకి చికిత్స కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం జైట్లీకి కార్డియాక్ న్యూరో సెంటర్లో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు, జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఎయిమ్స్కు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.