యాప్నగరం

పుదుచ్చేరి: పడవల తయారీ కంపెనీ భారీ అగ్ని ప్రమాదం

వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలతో ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. పుదుచ్చేరి హార్బర్ సమీపంలో తాజాగా ప్రమాదం సంభవించింది.

Samayam Telugu 21 Aug 2020, 11:57 am
పుదుచ్చేరి హార్బర్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోకోనట్ హార్బర్ వద్ద పడవల తయారీ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Samayam Telugu పుదుచ్చేరి అగ్ని ప్రమాదం


ప్రమాదం ఎలా జరిగిందనేది విచారణలో వెల్లడవుతుందని మొదిలియార్‌పేట్ పోలీసులు తెలిపారు. అయితే, ఎవ్వరూ గాయపడలేదని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.