యాప్నగరం

రిలయన్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

కార్మికులు స్నాక్స్ తినేందుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Samayam Telugu 29 Nov 2018, 4:26 pm
గుజరాత్‌లోని రిలయన్స్ రబ్బర్ పరిశ్రమలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పరిశ్రమలోని ఓ కీలక విభాగంలో మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన సంస్థ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురు ఒప్పంద కార్మికులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కార్మికులు స్నాక్స్ తినేందుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
Samayam Telugu reliancefire


మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన సంస్థ యాజమాన్యం.. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించింది.
ఈ ప్రమాదంపై విచారణ చేస్తున్నామని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. ఘటనకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకుని అందుకనుగుణంగా చర్చలు తీసుకుంటామన్నాయి. మంటలు అదుపులోకి రావడంతో ప్లాంట్‌లో కార్యకలాపాలు యథావిథిగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.