మెస్లో పెడుతోన్న ఆహారం జంతువులు కూడా తినలేనంత నాసిరకంగా ఉందంటూ ఓ పోలీస్ కానిస్టేబుల్ ( Police Constable) నడిరోడ్డుపై ఆందోళనకు దిగాడు. మెస్లో పెట్టిన రోటీ, పప్పును ప్లేటుతో పాటు రోడ్డు మీదకు తీసుకొచ్చి అందరికీ చూపిస్తూ బోరున విలపించాడు. రోడ్డు మధ్యలో డివైడర్ వద్ద కూర్చొని నిరసన తెలియజేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని ఫిరోజాబాద్లో (Firozabad Police Constable) బుధవారం చోటుచేసుకుంది. అలీగఢ్కు చెందిన మనోజ్ కుమార్ అనే కానిస్టేబుల్ (Constable Manoj Kumar) ఫిరోజాబాద్ పోలీస్ లైన్స్ (Firozabad Police Lines) పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పోలీస్ లైన్స్ పరిధిలో పనిచేసే సిబ్బందికి మెస్లోనే భోజనం పెడతారు. అయితే, ఈ మెస్లో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ బుధవారం మనోజ్ కుమార్ నిరసన చేపట్టాడు. మెస్లో పెట్టిన రొట్టెలు, అన్నం, పప్పు ఒక ప్లేటులో పెట్టుకుని రోడ్డు మీదికి వచ్చాడు. వాటిని స్థానికులకు చూపిస్తూ బోరున విలపించాడు. ఇలాంటి రొట్టెలు కుక్కలు కూడా తినవని మనోజ్ కన్నీరుమున్నీరు అయ్యాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులందరికీ పౌష్టికాహారం పెట్టాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలెవెన్స్ను 30 శాతం పెంచినా మెస్ యాజమాన్యం, అధికారులు మాత్రం ఇలాంటి నాసిరకం భోజనం పెడుతున్నారని అతడు వాపోయాడు. రోజుకు 12 గంటలు పనిచేసే తనలాంటి కానిస్టేబుళ్లు ఇలాంటి భోజనం ఎలా తింటారని ప్రశ్నించాడు. ఇలాంటి భోజనం తినలేక ఎన్నో రోజులు పస్తులున్నానని విలపించాడు.
మనోజ్ కుమార్ విలపిస్తున్న వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫిరోజాబాద్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఆహారం బాగాలేకపోతే నిరసన తెలియజేయాల్సిన పద్ధతి ఇది కాదని పోలీస్ ఉన్నతాధికారులు అన్నారు. క్రమశిక్షణ లేకపోవడం, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం మనోజ్ కుమార్కు పరిపాటిగా మారిపోయిందని.. అతడిపై ఇప్పటికే 15 సార్లు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయినప్పటికీ మనోజ్ కుమార్ ఫిర్యాదును తీసుకొని మెస్లో భోజనం నాణ్యతను పరిశీలిస్తామని చెప్పారు. అతడిపై మరోసారి క్రమశిక్షణా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
మనోజ్ కుమార్ విలపిస్తున్న వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫిరోజాబాద్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఆహారం బాగాలేకపోతే నిరసన తెలియజేయాల్సిన పద్ధతి ఇది కాదని పోలీస్ ఉన్నతాధికారులు అన్నారు. క్రమశిక్షణ లేకపోవడం, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం మనోజ్ కుమార్కు పరిపాటిగా మారిపోయిందని.. అతడిపై ఇప్పటికే 15 సార్లు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయినప్పటికీ మనోజ్ కుమార్ ఫిర్యాదును తీసుకొని మెస్లో భోజనం నాణ్యతను పరిశీలిస్తామని చెప్పారు. అతడిపై మరోసారి క్రమశిక్షణా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.