యాప్నగరం

పంజాబ్ సరిహద్దుల్లో ఐదుగురు చొరబాటుదార్లను కాల్చి చంపిన సైన్యం

పాకిస్థాన్-భారత్ అంతర్జాతీయ సరిహద్దుల్లో శనివారం ఉదయం ఐదుగురు చొరబాటుదారులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైన్యం కాల్చి చంపింది. కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కాల్పులు జరిపింది.

Samayam Telugu 22 Aug 2020, 12:55 pm
పంజాబ్ సరిహద్దుల్లోని ఐదుగురు చొరబాటుదారులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాల్చి చంపింది. పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద శనివారం ఉదయం ఐదుగుర్ని సైన్యం కాల్చి చంపినట్టు ఉన్నతాధికారి తెలిపారు. తరాన్ తరాన్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా.. బీఎస్ఎఫ్‌కి 103 బెటాలియన్ దళాలు అప్రమత్తమయ్యాయని పేర్కొన్నారు.
Samayam Telugu బీఎస్ఎఫ్
File photo used for representation


వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. ఈ సమయంలో సైన్యంపై చొరబాటుదారులు కాల్పులు జరిపారని, ఆత్మరక్షణ కోసంం బీఎస్ఐ సైనికులు ఎదురు కాల్పులు జరిపినట్టు వివరించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు చొరబాటుదారులు హతమైనట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు చోటుచేసుకున్నట్టు మరో అధికారి పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టామని, ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించాయి. చొరబాటుదారుల నుంచి ఒక ఏకే 47, రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. నిరంతరం కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాదులను దేశంలోకి ఎగదోసే ప్రయత్నాలు చేస్తోంది.

ఇదే సమయంలో పంజాబ్‌వైపు నుంచి కూడా డ్రోన్లతో దాడులకు ప్రయత్నిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జమ్మూ సరిహద్దుల్లోని ఇంద్రేశ్వర్ నగర్ సెక్టార్‌లో సైనిక పోస్టులపై పాకిస్థాన్ దళాలు విచక్షణారహితంగా కాల్పలుకు తెగబడ్డాయి. పాక్ దుశ్చర్యలకు బీఎస్ఎఫ్ బలగాలు దీటుగా బదులిచ్చినట్టు సైనిక వర్గాలు తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.