యాప్నగరం

బోటులో అగ్నిప్రమాదం.. ఐదుగురు కూలీలు సజీవదహనం

Fire Accident in Boat: పడవలో వంట చేస్తుండగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. బిహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా రాంపూర్‌లోని దియారా ఘాట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తీరానికి సమీపంలో నిలిపి ఉంచిన మర బోటులో వంట చేస్తుండగా.. ఈ అగ్నిప్రమాదం సంభవించింది. బోటులో ఉన్న డీజిల్ క్యాన్‌కు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని ఈ ఘోరం జరిగింది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 6 Aug 2022, 4:10 pm
Samayam Telugu Fire Accident in Boat in Bihar
బీహార్ బోటు ప్రమాదం
డవలో వంట చేస్తుండగా అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. బిహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా రాంపూర్‌లోని దియారా ఘాట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తీరానికి సమీపంలో నిలిపి ఉంచిన మర బోటులో (Motor Boat) వంట చేస్తుండగా.. ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తొలుత భావించారు. అయితే.. డీజిల్ నింపి ఉంచిన క్యాన్ సమీపంలో స్టవ్ వెలిగించి వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ డీజిల్‌కు మంటలు అంటుకొని బీభత్సం జరిగిందని పోలీసులు తెలిపారు.

బోటులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో కూలీలు చిక్కుకుపోయి మరణించారు. మృతులను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.