యాప్నగరం

పిక్నిక్‌లో విషాదం.. జలపాతం వద్ద ఐదుగురి మృతి

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని రహత్‌గర్ జలపాతం వద్ద విషాదం చోటు చేసుకుంది. నీటిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు.

Samayam Telugu 18 Nov 2020, 12:10 am
రదాగా పిక్నిక్‌‌కి వెళితే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జలపాతం వద్ద నీటిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లోని రహత్‌గర్ వాటర్‌ఫాల్స్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగిన మరో వ్యక్తిని అక్కడికి పర్యటనకు వచ్చిన కొంత మంది కాపాడారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Family drown in Madhya Pradesh


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన ఆరుగురు కుటుంబ సభ్యులతో ఆటో రిక్షాలో రహత్‌గర్ జలపాతం వద్ద సరదాగా గడపడానికి వచ్చాడు. అక్కడ జలపాతం అందాలను చూస్తూ ఆహ్లాదంగా గడిపిన తర్వాత.. ఆ కుటుంబసభ్యులు నిషేధిత ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ వంట చేసుకుంటుండగా.. ఉన్నట్టుండి నీటి ప్రవాహం పెరిగింది.

ప్రవాహంలో చిక్కుకొని ఆరుగురు కుటుంబసభ్యులు నీటలో కొట్టుకుపోయారు. వారిలో ఒకరిని అక్కడే ఉన్న కొంత మంది కాపడగా.. మిగిలిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.