యాప్నగరం

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

పండగపూట విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ఎదురుగా వస్తోన్న లారీని ఢీకొట్టడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో బస్సులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 19 Oct 2018, 10:10 am
తమిళనాడులో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విల్లుపురం జిల్లా ఉల్లందూర్‌పేట్ వద్ద లారీని ప్రయివేట్ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మృతిచెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న లారీని ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వారంతా మంటల్లో చిక్కుకున్నారు. ప్రయాణికులు కళ్లు తెరిచేలోపే మంటలు వ్యాపించడంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. అప్రమత్తమైన కొంత మంది ప్రయాణికులు బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్దమయింది.
Samayam Telugu రోడ్డు ప్రమాదం


ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదుచేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.