యాప్నగరం

ఐదుగురు రెజ్లర్లను బలితీసుకున్న యాక్సిడెంట్

మహారాష్ట్రలో శనివారం ఉదయం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు రెజ్లర్లు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

TNN 13 Jan 2018, 1:47 pm
మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు రెజ్లర్లు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పశ్చిమ మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో శనివారం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఔంద్‌లో జరిగిన స్థానిక పోటీల్లో పాల్గొని తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తోన్న వాహనం ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. కడేగావ్-సంగ్లీ మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడినట్లు తెలుస్తోంది.
Samayam Telugu five wrestlers among six killed in maharashtra road accident
ఐదుగురు రెజ్లర్లను బలితీసుకున్న యాక్సిడెంట్


వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఎదురుగా వచ్చి కారును ఢీకొట్టడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. గాయపడిన వారికి సంగ్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన రెజ్లర్లు ‘క్రాంతి కుస్తీ సంకుల్’కు చెందిన వారని తెలుస్తోంది.



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.