Chennai: దక్షిణ చెన్నై శివారు ప్రాంతం కీల్కట్టలై సమీపంలోని మూవరసంపేట కొలనులో బుధవారం ఉదయం ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ధర్మలింగేశ్వరార్ ఆలయంలోని తీర్థవారి ఉత్సవాల్లో యువకులు పాల్గొన్న సమయంలో ఈ విషాదం జరిగింది. 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు Dharmalingeshwarar temple నీటిలోకి వెళ్లడంతో మునిగిపోయారని పోలీసులు వివరించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పలవంతంగల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. కొలను నుంచి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఐదుగురిని మడిపాక్కంకు చెందిన రాఘవన్, కీల్కట్టలైకి చెందిన యోగేశ్వరన్, నంగనల్లూరుకు చెందిన వనేష్, రాఘవన్, ఆర్.సూర్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అనంతరం హిందూ మత పెద్దలు, ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు కొలనును పరిశీలించారు.
ఈ విషాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల మధ్యప్రదేశ్లో మెట్లబావి ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఇండోర్లోని బేలేశ్వర్ మహదేవ్ ఝాలేలాల్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. రద్దీ ఎక్కువై, ప్రాంగణంలోని మెట్లబావి పైకప్పుపై కూర్చున్నారు. ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కూలి, 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల మధ్యప్రదేశ్లో మెట్లబావి ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఇండోర్లోని బేలేశ్వర్ మహదేవ్ ఝాలేలాల్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. రద్దీ ఎక్కువై, ప్రాంగణంలోని మెట్లబావి పైకప్పుపై కూర్చున్నారు. ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కూలి, 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.