ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. విమానం ఎక్కేందుకు ప్రయాణికులకు అపసోపాలు పడాల్సి వస్తోంది. గంటలకొద్దీ వెయిటింగ్ చేయాల్సి వస్తోందని ప్రయాణికుల నుంచి కొంతకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీనికి తోడు ఎయిర్పోర్టులోని ఓ భాగంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఫలితంగా ప్రయాణికులకు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. ఈ విషయం తెలియని వారు విమానం మిస్ చేసుకొని ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు.. ‘ఢిల్లీ ఎయిర్పోర్టులో పరిస్థితి’పై నెటిజన్లు మీమ్స్తో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ విమానాశ్రయానికి వచ్చేకంటే రైల్లో వెళ్లేది ఉత్తమం అని ట్వీట్ చేస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టు పరిస్థితి చేపల మార్కెట్ కంటే అధ్వాన్నంగా తయారైందని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు.. ఢిల్లీ ఎయిర్పోర్టులో పరిస్థితి గురించి ‘ఇండిగో ఎయిర్లైన్స్’ తన ప్రయాణికులకు కొన్ని సూచనలు జారీ చేసింది. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి డొమెస్టిక్ ప్రయాణాలు చేయాల్సిన వారు కనీసం మూడున్నర గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని ఇండిగో సంస్థ సూచించింది. 7 కిలోగ్రామలు లోపు బరువుండే ఒకే బ్యాగ్తో వస్తే సెక్యూరిటీ క్లియరెన్స్ త్వరగా లభిస్తుందని పేర్కొంది.
చెక్-ఇన్, బోర్డింగ్కు అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం పట్టొచ్చని ఇండిగో హెచ్చరించింది. ప్రయాణికులు వారి వెబ్ చెక్-ఇన్ను పూర్తి చేసుకొని రావాలని సూచించింది. ఎయిర్పోర్టు లోపల టెర్మినల్ 3కి చేరుకునేందుకు గేట్ నం.5, గేట్ నం. 6 మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. ఈ మేరకు ఇండిగో తన ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది.
దేశంలోనే అతిపెద్దదైన ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ట్రాఫిక్ను తగ్గించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో విమానాల సంఖ్యను తగ్గించారు. కొన్ని విమానాలను టెర్మినల్-3 నుంచి మళ్లించనున్నారు.
ఢిల్లీ విమానాశ్రయంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం ఎయిర్పోర్టును తనిఖీ చేశారు. అధికారులతో మాట్లాడి.. అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయించారు.
రద్దీ నియంత్రణ చర్యల్లో భాగంగా.. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విమానాల సంఖ్యను తగ్గించనున్నారు. అంతేకాకుండా.. వెయిటింగ్ సమయం ఎంత ఉందో సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణికులు తెలుసుకునేలా పోస్టులు పెట్టనున్నారు. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద డిజిటల్ డిస్ప్లే బోర్డులపైనా టైమింగ్స్ ప్రదర్శించనున్నారు. ఎంట్రీల సంఖ్యను కూడా పెంచనున్నారు.
మరోవైపు.. ఢిల్లీ ఎయిర్పోర్టులో పరిస్థితి గురించి ‘ఇండిగో ఎయిర్లైన్స్’ తన ప్రయాణికులకు కొన్ని సూచనలు జారీ చేసింది. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి డొమెస్టిక్ ప్రయాణాలు చేయాల్సిన వారు కనీసం మూడున్నర గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని ఇండిగో సంస్థ సూచించింది. 7 కిలోగ్రామలు లోపు బరువుండే ఒకే బ్యాగ్తో వస్తే సెక్యూరిటీ క్లియరెన్స్ త్వరగా లభిస్తుందని పేర్కొంది.
చెక్-ఇన్, బోర్డింగ్కు అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం పట్టొచ్చని ఇండిగో హెచ్చరించింది. ప్రయాణికులు వారి వెబ్ చెక్-ఇన్ను పూర్తి చేసుకొని రావాలని సూచించింది. ఎయిర్పోర్టు లోపల టెర్మినల్ 3కి చేరుకునేందుకు గేట్ నం.5, గేట్ నం. 6 మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. ఈ మేరకు ఇండిగో తన ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది.
దేశంలోనే అతిపెద్దదైన ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ట్రాఫిక్ను తగ్గించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో విమానాల సంఖ్యను తగ్గించారు. కొన్ని విమానాలను టెర్మినల్-3 నుంచి మళ్లించనున్నారు.
ఢిల్లీ విమానాశ్రయంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం ఎయిర్పోర్టును తనిఖీ చేశారు. అధికారులతో మాట్లాడి.. అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయించారు.
రద్దీ నియంత్రణ చర్యల్లో భాగంగా.. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విమానాల సంఖ్యను తగ్గించనున్నారు. అంతేకాకుండా.. వెయిటింగ్ సమయం ఎంత ఉందో సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణికులు తెలుసుకునేలా పోస్టులు పెట్టనున్నారు. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద డిజిటల్ డిస్ప్లే బోర్డులపైనా టైమింగ్స్ ప్రదర్శించనున్నారు. ఎంట్రీల సంఖ్యను కూడా పెంచనున్నారు.