నరేంద్ర మోదీ తల్లికి తాను దేశానికి ప్రధానమంత్రి అయినప్పటికీ కంటే సంతోషం కల్గించిన సందర్భం మరోటి ఉందట. మోదీ గుజరాత్కు ముఖ్యమంత్రి అయినప్పుడే ఆయన అమ్మ గారు ఎక్కువగా ఆనందపడ్డారట. ఈ విషయాన్ని స్వయంగా మోదీయే చెప్పారు. అందుకు కారణం కూడా బలమైందే ఉంది. ప్రముఖ సోషల్ మీడియా పేజీ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ వివరాలను వెల్లడించారు. ‘మీరు ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మీ అమ్మగారు ఎలా ఫీలయ్యారు? అని ఇప్పటికీ చాలా మంది నన్ను అడుగుతుంటారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా నా పేరు మార్మోగుతోంది. నా ఫోటోలను ప్రముఖంగా ప్రచురించారు. చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు. కానీ, మా అమ్మకు అంతకంటే సంతోషం ఇచ్చిన సందర్భం మరోటి ఉంది. నేను ప్రధాని అయినప్పటి కంటే గుజరాత్కు సీఎం అయినప్పుడే మా అమ్మ ఎక్కువగా ఆనందించారు’ అని మోదీ చెప్పారు.
‘గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ముందు నేను ఢిల్లీలో ఉండేవాణ్ని. సీఎంగా పేరు ప్రకటించాక నేను అమ్మను కలవడానికి నేరుగా అహ్మదాబాద్ వెళ్లా. అప్పటికే అక్కడ సందడి వాతావరణం ఉంది. నేను ముఖ్యమంత్రిని అవుతున్నానన్న విషయం ఆమెకు తెలిసింది. నన్ను చూడగానే మా అమ్మ ఆనందంతో నన్ను దగ్గరకు తీసుకుంది. ఆప్యాయంగా కౌగలించుకుని.. నువ్వు మళ్లీ గుజరాత్కు వచ్చేశావు, అదే నాకు గొప్ప విషయం అని చెప్పారు. తల్లి మనసంటే అదే కదా!’ అని మోదీ చెప్పారు.
తన చుట్టూ ఏం జరుగుతున్నా సరే.. తన పిల్లలకు దగ్గరగా ఉండాలనే ప్రతి తల్లీ కోరుకుంటుందని మోదీ చెప్పుకొచ్చారు. అందుకే తన తల్లికి తాను సీఎం అవుతున్నదాని కంటే.. ఇకపై గుజరాత్లోనే ఉంటాడనే విషయం ఎక్కువ సంతోషాన్ని కల్గించిందని ఆయన వివరించారు.
తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు మొట్టమొదటిసారిగా తన అమ్మ తనకో మాట కూడా చెప్పారని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. కానీ, జీవితంలో ఎప్పుడూ లంచం తీసుకోనని నాకు మాటివ్వు. ఆ పాపాన్ని నువ్వు ఎన్నడూ చేయకు అని అమ్మ నాతో అన్నారు’ అని మోదీ చెప్పుకొచ్చారు.
ఆ మాటలు తనపై ఎంతో ప్రభావం చూపాయని.. ప్రధాని అయిన తర్వాత కూడా తాను ఆ విలువలను పాటిస్తున్నానని మోదీ తెలిపారు. ‘ప్రధాని కావొచ్చు, సీఎం కావొచ్చు.. దేశం పట్ల నిజాయతీగా ఉండాలనే అమ్మ ఆకాంక్షిస్తారు. నాకేదైనా సాధారణ ఉద్యోగం వచ్చినా అమ్మ ఇదే చెప్పేవారు. ఊరంతా మిఠాయిలు పంచేవారు’ అని మోదీ చెప్పారు.
జీవితాంతం కడు పేదరికాన్ని అనుభవించి కూడా ఓ మహిళ అత్యంత ఆనందకర సమయంలో తన కుమారుడికి అలాంటి మాటలు చెప్పడం తనకు మరింత ఆనందాన్ని కల్గించిందని మోదీ తెలిపారు. చాయ్ వాలాగా జీవితం ప్రారంభించిన ఓ సామాన్యుడు.. ప్రధాని పదవి వరకు ఎదిగిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు.
2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ 13 ఏళ్ల పాటు సేవలు అందించారు. అహ్మదాబాద్లో ఉంటున్న తన తల్లి హీరాబెన్ మోదీని తరచూ కలిసి వస్తుంటారు. తన పుట్టినరోజు, ఇతర ముఖ్యమైన రోజుల్లో తన తల్లిగారి వద్దకు వెళ్తుంటారు. ప్రస్తుతం ఆమె వయసు 90 ఏళ్ల పైమాటే.
‘గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ముందు నేను ఢిల్లీలో ఉండేవాణ్ని. సీఎంగా పేరు ప్రకటించాక నేను అమ్మను కలవడానికి నేరుగా అహ్మదాబాద్ వెళ్లా. అప్పటికే అక్కడ సందడి వాతావరణం ఉంది. నేను ముఖ్యమంత్రిని అవుతున్నానన్న విషయం ఆమెకు తెలిసింది. నన్ను చూడగానే మా అమ్మ ఆనందంతో నన్ను దగ్గరకు తీసుకుంది. ఆప్యాయంగా కౌగలించుకుని.. నువ్వు మళ్లీ గుజరాత్కు వచ్చేశావు, అదే నాకు గొప్ప విషయం అని చెప్పారు. తల్లి మనసంటే అదే కదా!’ అని మోదీ చెప్పారు.
తన చుట్టూ ఏం జరుగుతున్నా సరే.. తన పిల్లలకు దగ్గరగా ఉండాలనే ప్రతి తల్లీ కోరుకుంటుందని మోదీ చెప్పుకొచ్చారు. అందుకే తన తల్లికి తాను సీఎం అవుతున్నదాని కంటే.. ఇకపై గుజరాత్లోనే ఉంటాడనే విషయం ఎక్కువ సంతోషాన్ని కల్గించిందని ఆయన వివరించారు.
తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు మొట్టమొదటిసారిగా తన అమ్మ తనకో మాట కూడా చెప్పారని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. కానీ, జీవితంలో ఎప్పుడూ లంచం తీసుకోనని నాకు మాటివ్వు. ఆ పాపాన్ని నువ్వు ఎన్నడూ చేయకు అని అమ్మ నాతో అన్నారు’ అని మోదీ చెప్పుకొచ్చారు.
ఆ మాటలు తనపై ఎంతో ప్రభావం చూపాయని.. ప్రధాని అయిన తర్వాత కూడా తాను ఆ విలువలను పాటిస్తున్నానని మోదీ తెలిపారు. ‘ప్రధాని కావొచ్చు, సీఎం కావొచ్చు.. దేశం పట్ల నిజాయతీగా ఉండాలనే అమ్మ ఆకాంక్షిస్తారు. నాకేదైనా సాధారణ ఉద్యోగం వచ్చినా అమ్మ ఇదే చెప్పేవారు. ఊరంతా మిఠాయిలు పంచేవారు’ అని మోదీ చెప్పారు.
జీవితాంతం కడు పేదరికాన్ని అనుభవించి కూడా ఓ మహిళ అత్యంత ఆనందకర సమయంలో తన కుమారుడికి అలాంటి మాటలు చెప్పడం తనకు మరింత ఆనందాన్ని కల్గించిందని మోదీ తెలిపారు. చాయ్ వాలాగా జీవితం ప్రారంభించిన ఓ సామాన్యుడు.. ప్రధాని పదవి వరకు ఎదిగిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు.
2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ 13 ఏళ్ల పాటు సేవలు అందించారు. అహ్మదాబాద్లో ఉంటున్న తన తల్లి హీరాబెన్ మోదీని తరచూ కలిసి వస్తుంటారు. తన పుట్టినరోజు, ఇతర ముఖ్యమైన రోజుల్లో తన తల్లిగారి వద్దకు వెళ్తుంటారు. ప్రస్తుతం ఆమె వయసు 90 ఏళ్ల పైమాటే.