యాప్నగరం

ప్రళయం వచ్చినా పాక్‌లో కశ్మీర్‌ కలవదు - సుష్మ

కశ్మీర్ ప్రాంతం పాక్ లో కలిసిపోతుందన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలకు సుష్మ ధీటుగా బదులిచ్చారు.

TNN 23 Jul 2016, 9:43 pm
కశ్మీర్‌ ప్రాంతం పాకిస్తాన్‌లో కలిసిపోతుందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు విదేశాంగ మంత్రి సుష్మ ధీటుగా జవాబిచ్చారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రళయం వచ్చినా కూడా కశ్మీర్ పాక్ లో కలవదనని స్పష్టం చేశారు. పాక్ కంటున్న పగటి కలలు ఎప్పటికీ నెరవేరవన్నారు. కశ్మీర్ ను ఆక్రమించుకోవాలన్న దుర్భుద్ధితోనే ఉగ్రవాదులను ఉసిగొల్పి పాక్ అక్కడ అలజడి సృష్టిస్తోదని విమర్శించారు. కశ్మీర్ ను అస్థిర పరచాలనే పాక్ వ్యూహాన్ని ఎలా తిప్పికొట్టాలనే విషయం భారత్ కు తెలుసని.. సరైన సమయంలో సరైన విధంగా పాక్ సమాధానమిస్తామన్నారు.
Samayam Telugu foreign minister sushma fires on pak
ప్రళయం వచ్చినా పాక్‌లో కశ్మీర్‌ కలవదు - సుష్మ


బుర్హానీ అమరుడు ఎలా అవుతాడు ?

కశ్మీర్ ను ఆశ్రమించుకోవాలనే దుర్భద్ధితోనే అక్కడ హిజ్బుల్ ముజాహీదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు పెంచిపోషిస్తోందన్నారు. బుర్హానీ హిజ్బుల్ ముజాహీదీన్ కమాండర్ అని తెలిసి కూడా అతన్ని అమరుడిగా చిత్రికరించడం వంటి పరిణామాలతో ఉగ్రవాదాన్ని పాక్ ఏ స్థాయిలో పెంచి పోషిస్తోందన్న విషయం ప్రపంచానికి అర్థమైపోయిందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.