విమానం ఎక్కాలంటే ఐడీ ప్రూఫ్ తప్పనిసరి కదూ. కానీ ఇక దేశీయంగా ప్రయాణించడానికి పాస్పోర్ట్, ఆధార్ లాంటి గుర్తింపు కార్డులను చూపించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. విమానయాన శాఖ ప్రయాణికుల ఆధార్, పాస్పోర్ట్ లాంటి ఐడీ వివరాలను ఎయిర్లైన్స్, ఎయిర్పోర్టుల డేటాబేస్తో అనుసంధానిస్తోంది. ఇది పూర్తయితే గుర్తింపు కార్డు చూపించే బదులు బయోమెట్రిక్స్తోనే ప్రయాణికులు విమానయానం చేయవచ్చు. అంతర్జాతీయ ప్రయాణానికి మాత్రం ఎప్పటిలాగే పాస్పోర్ట్ తప్పనిసరి కానుంది.
మనం ఏ విమాన టికెట్ బుక్ చేసుకున్నామనే వివరాలు విమాయాన సంస్థల దగ్గర ఉంటాయి. దీంతో బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసి టెర్మినల్లోకి ప్రవేశిస్తే చాలు.. ఈ-టికెట్ లేదా టికెట్ కూడా చూపించాల్సిన అవసరం ఉండదు. విమానాశ్రయాల్లో బోర్డింగ్ ప్రక్రియను కాగిత రహితం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగేస్తోంది. డిజి యాత్ర కార్యక్రమంలో భాగంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రయాణికుల సమయం కూడా అవుతుందని విమానయాన శాఖ భావిస్తోంది.
మనం ఏ విమాన టికెట్ బుక్ చేసుకున్నామనే వివరాలు విమాయాన సంస్థల దగ్గర ఉంటాయి. దీంతో బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసి టెర్మినల్లోకి ప్రవేశిస్తే చాలు.. ఈ-టికెట్ లేదా టికెట్ కూడా చూపించాల్సిన అవసరం ఉండదు. విమానాశ్రయాల్లో బోర్డింగ్ ప్రక్రియను కాగిత రహితం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగేస్తోంది. డిజి యాత్ర కార్యక్రమంలో భాగంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రయాణికుల సమయం కూడా అవుతుందని విమానయాన శాఖ భావిస్తోంది.