యాప్నగరం

వాటర్ ట్యాంక్ ఎక్కి తుపాకీతో కాల్చుకున్న మాజీ మంత్రి... కోడలే కారణం

ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ తుపాకీతో తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనపై కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేంద్ర బహుగుణ మనవరాలిని లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై కేసు కూడా పెట్టారు. అయితే దీనిపై మాజీ మంత్రి రాజేంద్బర బహుగుణ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకుండాపోయింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 27 May 2022, 5:01 pm

ప్రధానాంశాలు:

  • మనస్థాపానికి గురైన రాజేంద్ర బహుగుణ
  • తన బిడ్డను లైంగికంగా వేధించాడని కోడలు ఫిర్యాదు
  • రాజేంద్ర బహుగుణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu వాటర్ ట్యాంక్ ఎక్కి తుపాకీతో కాల్చుకున్న మాజీ మంత్రి... కోడలే కారణం
ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ (59) వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన బిడ్డను లైంగికంగా వేధించాడని ఆయన కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఆయన తీవ్ర మ‌న‌స్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్నారు. కోడలు చేసిన "ఆరోపణపై అతను చాలా కలత చెందాడు" అని సీనియర్ పోలీసు అధికారి పంకజ్ భట్ తెలిపారు.
కోడలు ఇచ్చిన ఫిర్యాదుతో రాజేంద్ర బహుగుణపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. దీంతో ఆయన తీవ్రంగా ఆవేదన చెందారు. దాంతో ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం ఎమర్జెన్సీ నెంబర్ 112కి డయల్ చేసి పోలీసులకు తన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. పోలీసులు చేరుకునే సమయానికి హల్గ్‌వానిలో ట్యాంక్ పైకి ఎక్కి, తనను తాను కాల్చుకుంటానని ప్రకటించారు. ఆ సందర్భంగా తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. పోలీసులు ఆ ప్రయత్నాన్ని ఆపడానికి ప్రయత్నించారు. కింద‌కు దిగి రావాల‌ని పోలీసులు వేడుకున్నారు. కానీ అంత‌లోనే త‌న ఛాతీపై మాజీ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడికక్కడే చనిపోయారు. ఆయన ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు వైద్యులు కూడా నిర్ధారించారు.

ఈ పరిణామంతో ఆయన కుమారుడు అజయ్ బహుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోలీసులు ఆయ‌న కోడ‌లితో పాటు మ‌రో ఇద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్న బహుగుణ హల్ద్వానీ డిపో వర్క్‌షాప్‌లో పనిచేసి అక్టోబర్ 31న పదవీ విరమణ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.