యాప్నగరం

Pranab Mukherjee Died: ప్రణబ్ ముఖర్జీ మృతి.. ‘సెప్టిక్ షాక్‌’ అంటే ఏమిటి?

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం క్షీణించింది. గత కొద్ది రోజులుగా కోమాలో ఉన్న ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా సెప్టిక్ షాక్‌లోకి వెళ్లారు. అనంతరం ఆయన తుది శ్వాస విడిచారు.

Samayam Telugu 31 Aug 2020, 7:24 pm
గత కొద్ది రోజులుగా కోమాలో ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి సోమవారం ఉదయానికి దిగజారింది. ఆదివారం నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆర్మీ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ‘సెప్టిక్ షాక్‌‌‌’లో ఉన్నారని.. వైద్య నిపుణుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డీప్ కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో సోమవారం సాయత్రం ఆయన తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu pranab


84 ఏళ్ల ప్రణబ్ ఆగస్టు 10న ఢిల్లీ కంటోన్మెంట్ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. మెదడులో రక్తం గడ్డ కట్టగా డాక్టర్లు ఆయనకు సర్జరీ చేశారు. అప్పటి నుంచి ఆయన కోమాలోనే ఉన్నారు. ప్రణబ్‌కు కోవిడ్ కూడా సోకింది. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల్లో ఒకరైన ప్రణబ్.. 2012-17 మధ్య భారత రాష్ట్రపతిగా వ్యవహరించారు.

సెప్టిక్ షాక్ అంటే...?
ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడినప్పుడు తాపజనక పదార్థాలను (ఇన్‌ఫ్లమేటరీ సబ్‌స్టేన్సెస్) రక్తంలోకి విడుదల చేయడం ద్వారా శరీరం స్పందిస్తుంది. ఇన్ఫెక్షన్‌పై పోరాడేందుకు ఇవి రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తాయి. కానీ ఈ ప్రతిస్పందనపై శరీరం నియంత్రణ కోల్పోయినప్పుడు శరీర అవయవాల్లో దెబ్బతినే మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా శరీరం పని చేయడం మానేసే ప్రమాదం ఉంది. దీన్నే సెప్సిస్ అంటారు.

ఎవరైనా వ్యక్తిలో సెస్పిస్‌తోపాటు లో బీపీ కూడా ఉండి... ఫ్లూయిడ్ ట్రీట్మెంట్‌తో మార్పు కనిపించకపోతే.. ఆ వ్యక్తి దేహం సెప్టిక్ షాక్‌కు గురైందని చెబుతారు. ఇలాంటి పరిస్థితుల్లో శరీర అవయవాలకు రక్తం సరఫరా చేసేందుకు వీలుగా.. బ్లడ్ ప్రెజర్ పెంచే ఔషధాలను ఇస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.