మాజీ గవర్నర్ ఎన్డీ తివారి కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన ఎన్డీ తివారి ఇకలేరు.. అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో మృతి .
Samayam Telugu 18 Oct 2018, 4:36 pm
కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్డీ తివారి (93) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. తివారి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్కు సీఎంగా సేవలందించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నర్గా కొనసాగారు. తివారి మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీతో పాటూ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఉత్తరాఖండ్ సీఎంగా ఆయన చేసిన సేవల్ని కొనియాడారు.
ఈ ఏడాది జులైలో ఎన్డీ తివారి అనారోగ్యంతో మ్యాక్స్ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే గురువారం ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అంతేకాదు జన్మదినం రోజే తివారి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
తివారి పూర్తి పేరు నారాయణ దత్ తివారి. 1925 అక్టోబర్ 18న ఉత్తరాఖండ్లోని నైనిటాల్జిల్లా బాలూటి గ్రామంలో జన్మించారు. రాజకీయాల్లోకి వచ్చాక 1967లో జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు.ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ ఆయన సేవలందించారు. 2007 ఆగస్టు 19న ఏపీ గవర్నర్గా నియమితులైన తివారి 2009 డిసెంబర్లో తన పదవికి రాజీనామా చేశారు.
ఈ ఏడాది జులైలో ఎన్డీ తివారి అనారోగ్యంతో మ్యాక్స్ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే గురువారం ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అంతేకాదు జన్మదినం రోజే తివారి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
తివారి పూర్తి పేరు నారాయణ దత్ తివారి. 1925 అక్టోబర్ 18న ఉత్తరాఖండ్లోని నైనిటాల్జిల్లా బాలూటి గ్రామంలో జన్మించారు. రాజకీయాల్లోకి వచ్చాక 1967లో జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు.ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ ఆయన సేవలందించారు. 2007 ఆగస్టు 19న ఏపీ గవర్నర్గా నియమితులైన తివారి 2009 డిసెంబర్లో తన పదవికి రాజీనామా చేశారు.