యాప్నగరం

విద్యార్థుల కళ్లెదుటే ప్రిన్సిపల్ దారుణ హత్య!

తరగతి గదిలో విద్యార్థుల కళ్లెదుటే దుండగులు ప్రిన్సిపల్‌ను దారుణంగా హతమార్చారు.

Samayam Telugu 15 Oct 2018, 10:35 pm
బెంగళూరులో గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. పాఠశాలలోకి ప్రవేశించి విద్యార్థుల కళ్లెదుటే ప్రిన్సిపల్‌ను దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. శ్రీ మారుతీ విద్యా సమితి వ్యవస్థాపకుడు, ప్రిన్సిపల్ రంగనాథ్ నాయక్ తన పాఠశాల స్థల వివాదం పరిష్కరించేందుకు హవనూర్‌ పబ్లిక్ స్కూల్‌లో సమావేశం పెట్టారు.
Samayam Telugu Untitled111aaa


పాఠశాల స్థలం తమదని వాదిస్తున్న కొందరు వ్యక్తులు కూడా ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత.. ఆరుగురు వ్యక్తులు మరణాయుధాలతో వచ్చారు. ఆదివారం ప్రత్యేక తరగతులు కోసం హాజరైన సుమారు 20 మంది విద్యార్థుల ముందే ఆయన్ని దారుణంగా నరికి చంపారు. అనంతరం కారులో పారిపోయారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన నిందితులు కోసం గాలింపులు జరిపారు. నిందితుల్లో ఒకడు నగరంలోని మహాలక్ష్మీ లేఅవుట్‌లో ఉన్నాడని తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడు ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎదురుదాడికి దిగాడు. దీంతో ఒక కానిస్టేబుల్ అతడిపై కాల్పలు జరిపాడు. నిందితుడి కాలికి బులెట్ తగలడంతో కిందపడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని మునిరాజ్ ఉరఫ్ బబ్లీగా గుర్తించారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీమంత్ కుమార్ మాట్లాడుతూ.. మిగతా నిందితులను కూడా గుర్తించామని, త్వరలోనే అందరిని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.