యాప్నగరం

ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

ఇంటి పైకప్పు కూలి ముగ్గురు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో సంభవించింది. నిద్రలో ఉండగానే పైకప్పు కూలినట్టు అధికారులు తెలిపారు.

Samayam Telugu 24 Aug 2020, 8:28 am
రాజస్థాన్‌లో ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో శిధిలాల కింద చిక్కుకున్న‌వారిని బయటకు తీశారు. వీరిలో న‌లుగురు మృతి చెంద‌గా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలిని చికిత్స కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
Samayam Telugu అల్వాల్‌లో కూలిన ఇంటి పైకప్పు


అల్వాల్ జిల్లా కైమాలా గ్రామానికి చెందిన అలీముద్దీన్ కుటుంబ స‌భ్యులు ఆదివారం రాత్రి నిద్ర‌పోతున్న సమయంలో అకస్మాత్తుగా ఇంటి పైకప్పు కుప్పకూలింది. ఈ ప్ర‌మాదంలో అలీముద్దీన్‌తో పాటు అత‌ని ముగ్గురు పిల్లలు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన అలీముద్దీన్ భార్య ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో అలీముద్దీన్, ఆయన కుమార్తెలు షబ్నాబ్, సానియా, నెల రోజుల బాబు ప్రాణాలు కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.