యాప్నగరం

ప్రాణం తీసిన పొగమంచు: నలుగురు క్రీడాకారులు బలి

దట్టంగా కురుస్తున్న పొగమంచు నలుగు పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారుల ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది.

TNN 7 Jan 2018, 9:12 am
దట్టంగా కురుస్తున్న పొగమంచు నలుగు పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారుల ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. ఆరుగురు పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారులు ప్రయాణిస్తున్న కారు పొగమంచు కారణంగా ఢిల్లీ శివారులో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ప్రపంచ ఛాంపియన్ సాక్షం యాదవ్ కూడా ఉన్నారు. వీరంతా పానిపట్‌లోని అథ్లెటిక్ మీట్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న పోల్‌ను బలంగా ఢీకొట్టారు.
Samayam Telugu four powerlifting players killed in a road accident due to fog at singhu border
ప్రాణం తీసిన పొగమంచు: నలుగురు క్రీడాకారులు బలి


ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అలిపూర్ ఏరియా సింఘు బోర్డర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో హరీష్, టింకు, సూరజ్ చనిపోయినట్లు తెలిపారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. యాదవ్ అనుచరుడు బాలి తలకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు. తొలుత నాలుగు మృతదేహాలతో పాటు యాదవ్, బాలిలను రాజా హరీశ్ చంద్ర ఆస్పత్రికి తరలించారు. అనంతరం యాదవ్, బాలిలను మెరుగైన చికిత్స కోసం మ్యాక్స్ హాస్పిటల్‌కు మార్చారు. కాగా, సెక్షన్ 304ఎ (నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.