జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సైనికులే లక్ష్యంగా దాడులు తెగబడుతున్నారు. మొన్నటికి మొన్న కొందరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. రెండు రోజులు గడిచిందో లేదో మరో ఉగ్రదాడికి సిద్ధమయ్యారు. నలుగురు ఉగ్రవాదులు బందిపొరా జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ పై సోమవారం తెల్లవారుజామున దాడికి యత్నించారు. 45వ బెటాలియన్ లక్ష్యంగా ఆత్మాహుతిదాడికి ప్రయత్నించారు. వారిని గమనించిన భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఇరువురి మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. మొత్తం నలుగురు ఉగ్రవాదులు ఇందులో పాల్గొన్నారు. రెండు గంటల పాటూ కాల్పులు జరిగాక... ఆ నలుగురిని జవాన్లు కాల్చి చంపారు. సోమవారం ఉదయం 6.15కి ఎన్ కౌంటర్ ముగిసింది. ఉగ్రవాదల దగ్గర ఉన్న ఏకే 47 రైఫిల్స్, గ్రెనెడ్లను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇంకా ఉగ్రవాదులు ఉన్నారేమో అన్న అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.
కాగా కాశ్మీరులో పెట్రేగుతున్న ఉగ్రవాద చర్యలకు నిధులు కొందరు బడా బాబులు ఇస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. వారిలో వ్యాపారులు, నేతలు కూడా ఉన్నారు. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆ బడాబాబుల ఇళ్లలో ఎన్ఐఏ కొన్ని రోజులుగా సోదాలు చేస్తోంది.
కాగా కాశ్మీరులో పెట్రేగుతున్న ఉగ్రవాద చర్యలకు నిధులు కొందరు బడా బాబులు ఇస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. వారిలో వ్యాపారులు, నేతలు కూడా ఉన్నారు. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆ బడాబాబుల ఇళ్లలో ఎన్ఐఏ కొన్ని రోజులుగా సోదాలు చేస్తోంది.