యాప్నగరం

జమ్మూ కాశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు హతం

​ శనివారం ఉదయం నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి.

TNN 27 May 2017, 10:47 am
శనివారం ఉదయం నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. జమ్మూకాశ్మీర్ లోని రాంపూర్ సెక్టార్లో ఎల్వోసీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శనివారం ఉదయం ఎల్వోసీ వెంబడి అనుమానిత వ్యక్తుల కదలికలు ఉన్నట్టు భద్రతాదళాలకు సమాచారం అందింది. వెంటనే భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. అటునుంచి అనుమానిత వ్యక్తులకు కాల్పులు ప్రారంభించడంతో... వారిని ఉగ్రవాదులుగా గుర్తించారు అధికారులు. వెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించారు. నలుగురు ఉగ్రవాదుల్ని కాల్చి చంపాయి. ఇక్కడ ఇంకా ఉగ్రవాదులు ఉన్నారేమో అన్న అనుమానంతో ఇంకా సెర్చింగ్ జరుగుతోంది.
Samayam Telugu four terrorists killed in rampur sector in jammu kashmir
జమ్మూ కాశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు హతం


మరోపక్క సైము ట్రాల్ సెక్టార్ లో కూడా ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం వచ్చింది. శనివారం ఉదయం నుంచి ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అక్కడ ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్టు అనుమానిస్తున్నారు ఆర్మీ అధికారులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.