యాప్నగరం

నోయిడా: నలుగురు మహిళలపై గ్యాంగ్ రేప్

ఢిల్లీ శివారు గ్రేటర్ నోయిడాలో ఘోరం జరిగింది. గురువారం తెల్లవారుజామున నలుగురు మహిళలపై సామూహిక

TNN 25 May 2017, 2:39 pm
ఢిల్లీ శివారు గ్రేటర్ నోయిడాలో ఘోరం జరిగింది. గురువారం తెల్లవారుజామున నలుగురు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగింది. గుర్తు తెలియని దుండగులు కారులో ప్రయాణిస్తున్న మహిళలపై అత్యాచారం చేయడంతో అడ్డుకున్న ఓ వ్యక్తిని కాల్చి చంపారు. ఈ సంఘటన గ్రేటర్ నోయిడాలోని ఖుర్జా-జహర్ రహదారి (యమునా ఎక్స్ ప్రెస్ వే)పై చోటు చేసుకుంది.
Samayam Telugu four women gangraped man shot dead on yamuna expressway in noida
నోయిడా: నలుగురు మహిళలపై గ్యాంగ్ రేప్


బాధితులు, పోలీసుల కథనం ప్రకారం..జెవార్ కు చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులు (నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు) బుధవారం అర్థరాత్రి దాటాక బులందర్ షార్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువును పరామర్శించేందుకు కారులో బయలుదేరారు.

‘సబౌటా గ్రామానికి చేరుకోగానే మేం ప్రయాణిస్తున్న కారు టైర్లు పంక్చర్ అయ్యాయి’ అని ఒక బాధితురాలు చెప్పింది. పంక్చర్ కాగానే అందరూ కార్లో నుంచి బయటకి వచ్చారు. దీంతో అప్పటికే మాటు వేసిన 6-7 మంది దుండగులు తుపాకులతో బెదిరించి మహిళలను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం. మహిళలతో పాటు మగవాళ్ల దగ్గరున్న నగదు, నగదు లాక్కున్నారు. మహిళలపై అఘాయిత్యాన్ని అడ్డుకోబోయిన వాళ్ల బంధువుల్లో ఒకతన్ని దుండగులు కాల్చి చంపారు.

అతికష్టం మీద బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు దుండగులు పారిపోయారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారి లవ్ కుమార్ తెలిపారు.

మహిళలను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గతేడాది జులైలో ఇదే ప్రాంతంలో ఒక మహిళ, ఆమెతోపాటున్న 13ఏళ్ల కూతురుపై సామూహిక అత్యాచారం జరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.