యాప్నగరం

కేరళ సర్కారీ స్కూళ్లలో ఉచిత వైఫై

కేరళ సర్కారీ స్కూళ్లలో ఉచిత వైఫై సదుపాయం ప్రారంభిస్తున్నారు

TNN 24 Oct 2016, 3:04 am
కేరళ రాష్ట్రంలోని విద్యావ్యవస్థ డిజిటలైజేషన్ దిశగా శరవేగంగా ముందుకు సాగుతోంది. ఆ రాష్ట్రంలోని 10వేల వరకు ప్రభుత్వ పాఠశాలలు త్వరలో ఉచిత వైఫై సౌకర్యాన్ని పొందనున్నాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ సాయంతో కేరళ ప్రభుత్వపాఠశాలలను వైఫైతో అనుసంధానించనున్నట్లు ఆ రాష్ట్ర అధికారి ఒకరు తెలిపారు. కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదన జరుపుకుంటారు. అదే రోజు నుండి ఈ ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. నవంబర్ 1వ తేదీ నుండి విద్యార్థులందరికి 2 ఎంబీపీఎస్ వేగంతో ఉచితంగా వైఫై లభిస్తుంది.
Samayam Telugu free wifi in kerala government schools
కేరళ సర్కారీ స్కూళ్లలో ఉచిత వైఫై


ఇదిలా ఉండగా, దశాబ్దకాలం క్రితమే ఆ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాల విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనీ పరిచయం చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు వేల పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించారు. అది విజయవంతం కూడా అయింది. దాని స్ఫూర్తితోనే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో భాగంగా చిన్న తరగతుల నుండే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడంతో పాటు, వారు పెద్ద తరగతులకు వచ్చేసరికి ఐటీలో వారికి మంచి పునాదులు ఏర్పడేలా చేయడమే దీని లక్ష్యం అని అదికారులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.