యాప్నగరం

Taj Mahal: తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించండి.. కోర్టులో కొత్త పిటిషన్

Taj Mahal: దేశంలో మసీదు, మందిరం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న తాజ్‌ మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. అక్కడ తాజ్ మహల్ నిర్మించక ముందే ఆలయం ఉండేదని ఆధారాలు కూడా ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

Authored byశివరామచారి తాటికొండ | Samayam Telugu 3 Apr 2024, 3:05 pm
Taj Mahal: ప్రేమకు ప్రతిరూపంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న పాలరాతి కట్టడమైన తాజ్ మహల్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువు అయింది. మొఘలుల కాలంలో తన ప్రేయసి ముంతాజ్ కోసం షాజహాన్ నిర్మించిన అద్భుత కట్టడం అని చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంటుంది. అయితే తాజ్ మహల్‌ను షాజహాన్ కట్టించలేదని కొందరు వాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి వాదనలు సుప్రీం కోర్టు మెట్లు కూడా ఎక్కాయి. తాజాగా ఓ వ్యక్తి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. తాజ్ మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ కోర్టుకు ఎక్కాడు. దీంతో ఇది ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది.
Samayam Telugu Taj Mahal


తాజ్‌ మహల్‌ను తేజో మహాలయగా ప్రకటించాలని ఆ వ్యక్తి ఆగ్రా కోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలు చేశాడు. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడు, లాయర్ అయిన యవాది అజయ్ ప్రతాప్ సింగ్.. ఈ పిటిషన్‌ను ఆగ్రా కోర్టులో దాఖలు చేశారు. ఈ సందర్భంగానే ప్రస్తుతం తాజ్‌ మహల్‌లో నిర్వహిస్తున్న అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను వెంట‌నే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోర్టును కోరారు. అంతే కాకుండా ఆ నిర్మాణం తాజ్‌ మహల్‌గా గుర్తించక ముందే దానికి ఒక పురాతన చరిత్ర ఉందని కోర్టుకు విన్నవించారు.

ఇందుకు సంబంధించి పిటిషనర్ యవాది అజయ్ ప్రతాప్ సింగ్.. కొన్ని చారిత్రక పుస్తకాలను కూడా కోర్టుకు వెల్లడించారు. ఈ పిటిషన్‌పై ఆగ్రా కోర్టు వచ్చే నెల 9 వ తేదీన విచారణ జరపనుంది. ఇక తాజ్‌ మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు పలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు అయ్యాయి. అందులో కొన్ని పిటిషన్లను కోర్టులు కొట్టివేయగా.. మరికొన్ని పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
రచయిత గురించి
శివరామచారి తాటికొండ
శివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.