యాప్నగరం

అప్పు చెల్లించలేదని ఫ్రెండ్ భార్యను పెళ్లి చేసుకుని!

రెండు నెలల కిందట బసవరాజ్ భార్య పార్వతితో సహా పరారయ్యాడు రమేశ్. ఆపై ఆమెను పెళ్లి చేసుకుని రమేశ్ కాపురం చేస్తున్నాడు.

Samayam Telugu 26 Sep 2018, 3:26 pm
చేసిన అప్పు తీర్చకపోవడం ఓ వ్యక్తికి వింత సమస్యను తెచ్చిపెట్టింది. స్నేహితుడు తన భార్యను కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేసుకున్నాడంటూ బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu Karnataka Man


పోలీసుల కథనం ప్రకారం.. బెళగావిలోని ఒక హోటల్‌లో పనిచేస్తుండగా రమేశ్ హక్కేరి అనే వ్యక్తికి బసవరాజ్ కొనన్నవార్ పరిచయం అయ్యాడు. వీరిద్దరూ స్నేహితులయ్యారు. ఇదే హోటల్‌లో పనిచేసే బసవరాజ్ భార్య పార్వతితో రమేశ్‌కు పరిచయం ఏర్పడింది. కొన్ని నెలల కిందట రమేశ్ వద్ద బసవరాజ్ రూ. 500 అప్పుగా తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు చెల్లించకపోవడంతో రమేశ్ ఆవేశానికి లోనయ్యాడు.

రెండు నెలల కిందట బసవరాజ్ భార్య పార్వతితో సహా పరారయ్యాడు రమేశ్. ఆపై ఆమెను పెళ్లి చేసుకుని రమేశ్ కాపురం చేస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని రెండు నెలలుగా స్టేషన్ల చట్టూ తిరుగుతున్నానని బసవరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం డీసీపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాడు. తన భార్యను తిరిగి అప్పగించాలని కోరితే రమేశ్ దాడులకు పాల్పడుతున్నాడని, అతడు బెదిరింపులకు పాల్పడ్డ ఆడియో తన వద్ద ఉందన్నాడు బసవరాజ్. తన వద్దకు తిరిగొచ్చేందుకు భార్య నిరాకరిస్తుందని.. పోలీసులు జోక్యం చేసుకోవాలని బాధితుడు కోరాడు.

కాగా, బసవరాజ్, పార్వతిలకు 2011లో వివామమైంది. వీరికి మూడేళ్ల కూతురు ఉండగా, పార్వతి ప్రస్తుతం గర్భిణి. రమేశ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కమిషనర్ డీసీ రాజప్ప పోలీసులను ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.