యాప్నగరం

రాష్ట్రపతి ఎన్నిక: రేసులో గాంధీ మనవడు!

రాష్ట్రపతి ఎన్నికల రేసులో మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణగాంధీ పేరు తెరపైకి వచ్చింది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా

Samayam Telugu 11 May 2017, 7:13 pm
రాష్ట్రపతి ఎన్నికల రేసులో మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణగాంధీ పేరు తెరపైకి వచ్చింది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన్ను ఎన్నికల బరిలో దింపేందుకు కసరత్తు మొదలైంది. ఈ విషయాన్ని గోపాలకృష్ణ ధృవీకరించారు.
Samayam Telugu gandhis grandson gopalkrishna gandhi to be in president election
రాష్ట్రపతి ఎన్నిక: రేసులో గాంధీ మనవడు!


‘అవును, రాష్ట్రపతి ఎన్నికలో పోటీచేయడానికి నాతో ప్రతిపక్షాలు చర్చలు జరుపుతున్నాయి. చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను’ అని గోపాలకృష్ణ అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు గోపాలకృష్ణతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది.

అటు అధికార ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్మును రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

మరోవైపు ఎన్డీయే ముర్మును పోటీకి నిలబెడితే లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను పోటీ చేయించాలని ఆమె పేరును కూడా కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మ‌హాత్మాగాంధీ చిన్న కుమారుడైన దేవ‌దాస్ గాంధీ న‌లుగురు తనయుల్లో గోపాల‌కృష్ణ గాంధీ ఒక‌రు. ఏప్రిల్ 22 1945లో ఆయ‌న జ‌న్మించారు. ఢిల్లీ యూనివ‌ర్సిటీ నుంచి ఇంగ్లిష్ లిట‌రేచ‌ర్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 1968లో ఐఏఎస్‌లో చేరారు. 1987 నుంచి 1992 వ‌ర‌కు భార‌త రాష్ట్రప‌తికి జాయింట్ సెక్రట‌రీగా ప‌నిచేశారు. ఐఏఎస్ నుంచి 1992లో స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. 1996లో సౌతాఫ్రికాలో భార‌త హైక‌మిష‌న‌ర్‌గా ప‌నిచేశారు. 1997లో రాష్ట్రప‌తికి కార్యద‌ర్శిగా నియ‌మితుల‌య్యారు.
పశ్చిమ బెంగాల్ కు గవర్నర్ గా పనిచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.